ETV Bharat / bharat

'80 శాతం మంది వయోజనులకు వ్యాక్సినేషన్​ పూర్తి'​

author img

By

Published : Feb 18, 2022, 8:46 PM IST

India vaccination: దేశంలో ఇప్పటివరకు​ 80 శాతం మంది అర్హులైన వయోజనులకు కొవిట్​ టీకా రెండు డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న రెండు కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు చెప్పారు.

India vaccination
India vaccination

దేశంలో ఇప్పటివరకు 80 శాతం మంది అర్హులైన వయోజనులకు కరోనా టీకా రెండు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న రెండు కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీని యువతరం తదుపరి దశకు తీసుకెళ్లినట్లు కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిలో 70 శాతం మందికి ఒక డోసు పూర్తి చేసినట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 174 కోట్ల 64 లక్షల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

రాష్ట్రంలో కొవిడ్​ కేసులు తగ్గిన నేపథ్యంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని ఒడిశా సర్కారు నిర్ణయించింది. దీనిని శుక్రవారమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

Kerala Covid Cases

కేరళలో రోజువారీ కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే.. శుక్రవారం తగ్గాయి. తాజాగా 7,780 మందికి వైరస్​ సోకింది. మరో 18 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 63,529కు పెరిగింది. 21,134 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 85,875కు చేరింది.

మహారాష్ట్రలో కొత్తగా 2,068 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది మృతి చెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 21,159కు చేరింది. ఒక్క ముంబయిలో 202 కేసులు వెలుగు చూడగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: హిజాబ్​ ఇష్యూలో విద్యార్థులపై తొలికేసు- లెక్చరర్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.