ETV Bharat / bharat

దేశంలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Apr 20, 2022, 9:13 AM IST

corona cases
corona cases

Corona cases: భారత్​లో కొత్తగా 2,067 మందికి కరోనా సోకింది. మరో 40 మంది వైరస్ కారణంగా చనిపోయారు. 1,547 మంది కోలుకున్నారు.

Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగింది. మరో 2,067 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,547 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30లక్షల 47వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేల మార్కును అధిగమించింది.

  • యాక్టివ్ కేసులు: 12,340
  • మొత్తం మరణాలు: 5,22,006
  • మొత్తం కేసులు: 4,30,47,594
  • రికవరీలు: 4,25,13,248

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 17,23,733 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,90,56,607కు చేరింది. మరో 4,21,183 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 5,96,511 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,302 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • దక్షిణ కొరియాలో తాజాగా 1,18,445 కరోనా కేసులు నమోదయ్యాయి. 130 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 25,465 మంది వైరస్​ సోకింది. మరో 182 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 1,30,759 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 96 మంది మృతిచెందారు.
  • ఆస్ట్రేలియాలో 38,608 కరోనా కేసులు బయటపడ్డాయి. 21 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఇటలీలో 27,214 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 127 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: పరువు హత్య.. కుమార్తెను, అల్లుడిని దారుణంగా కత్తితో పొడిచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.