ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 15,223 మందికి కరోనా

author img

By

Published : Jan 21, 2021, 10:06 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 15,223 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 151 మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 6 లక్షలు దాటినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

India reports 15,223 new COVID19 cases
దేశంలో కొత్తగా 15,223 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 15,223 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మరో 151 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 19,965 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 1,06,10,883
  • క్రియాశీల కేసులు: 1,92,308
  • కోలుకున్నవారు: 1,02,65,706
  • మరణాలు: 1,52,869

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,06,484 మంది.. కొవిడ్​ టీకాను వేయించుకున్నారు.

ఇదీ చూడండి:చిన్నారులకు నాజల్‌ వ్యాక్సిన్‌ ఉత్తమం: ఎయిమ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.