ETV Bharat / bharat

ఒక్కరోజే 3.46 లక్షల కేసులు-  2,624 మరణాలు

author img

By

Published : Apr 24, 2021, 10:06 AM IST

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. తాజాగా 3.46 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరో 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid in india
కొవిడ్, దేశంలో కేసులు

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒక్కరోజే 3,46,786 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 2,624 వైరస్​కు బలయ్యారు. 2,19,838 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. వరుసగా మూడోరోజూ భారత్​లో 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి.

  • మొత్తం కేసులు: 1,66,10,481
  • మొత్తం మరణాలు: 1,89,544
  • మొత్తం కోలుకున్నవారు: 1,38,67,997
  • యాక్టివ్ కేసులు: 25,52,940

కొవిడ్​ నియంత్రణలో భాగంగా.. మొత్తంగా 13 కోట్ల 83 లక్షల 79 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఒకేసారి 2 చేతులతో రాసి.. ప్రపంచ రికార్డు కొల్లగొట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.