ETV Bharat / bharat

దేశంలో మరో 16,577 కేసులు.. 120 మరణాలు

author img

By

Published : Feb 26, 2021, 9:52 AM IST

దేశంలో కొత్తగా 16,577 మంది కరోనా​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 10లక్షల 63వేల 491కి చేరింది. వైరస్​ బారినపడిన వారిలో తాజాగా 12,179 మంది కోలుకున్నారు.

INDIA REGISTERED 16,577 NEW COVID-19 POSITIVE CASES AND 120 DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరో 16,577 కేసులు

దేశంలో బుధవారంతో పోల్చితే.. గురువారం కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 16,577 మందికి కొవిడ్​​​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 120 మంది కరోనా​తో మృతిచెందారు.

  • మొత్తం కేసులు: 1,10,63,491
  • మరణాలు: 1,56,825
  • రికవరీల సంఖ్య: 1,07,50,680
  • యాక్టివ్​ కేసులు: 1,55,986

వైరస్​ సోకిన వారిలో 12,179 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.17 శాతానికి తగ్గగా.. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా నమోదైంది.

అటు.. గురువారం ఒక్కరోజే 8లక్షల 31వేల 807 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 21.46 కోట్లు దాటింది.

దేశవ్యాప్తంగా మరో 8,01,480 మందికి కొవిడ్​ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 34లక్షల 72వేలు దాటినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: కొవిడ్ 2.0: మళ్లీ లాక్​డౌన్​ విధిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.