ETV Bharat / bharat

ఔరా ఇస్రో: పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగం విజయవంతం

author img

By

Published : Nov 7, 2020, 3:58 PM IST

Updated : Nov 7, 2020, 4:24 PM IST

isro
ఔరా ఇస్రో: 10 ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఖాతాలో మరో విజయం చేరింది. పీఎస్ఎల్​వీ సీ-49 వాహననౌక సాయంతో మొత్తం 10 ఉపగ్రహాలను.. విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్)‌ నుంచి పీఎస్ఎల్‌వీ సీ-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి.

pslv news
పీఎస్ఎల్​వీ సీ-49

భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగం విజయవంతంపై ఇస్రో ఛైర్మన్ శివన్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం సఫలీకృతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అంతకుముందు పీఎస్ఎల్‌వీ సీ-49 ప్రయోగం 10 నిమిషాలు వాయిదా పడింది. రాకెట్‌ ప్రయోగానికి షార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. భారీ వర్షం కారణంగా ప్రయోగం ఆలస్యం అయింది. మొదటగా 3:02 నిమిషాలకు ప్రయోగించాలని భావించిన శాస్త్రవేత్తలు.. పది నిమిషాలు ఆలస్యంగా 3:12కు రాకెట్‌ను ప్రయోగించారు.

Last Updated :Nov 7, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.