ETV Bharat / bharat

కరోనా విలయం.. కొత్తగా 20వేల కేసులు.. 145రోజుల తర్వాత తొలిసారి..

author img

By

Published : Jul 14, 2022, 9:10 AM IST

Updated : Jul 14, 2022, 10:03 AM IST

india-covid-cases-update
india-covid-cases-update

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,139 మంది కొవిడ్ బారినపడ్డారు. 38 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 145 రోజుల తర్వాత కేసులు 20వేల మార్కును దాటాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 20,139మంది వైరస్​ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,482 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 5.1 శాతంగా ఉంది.

  • మొత్తం మరణాలు: 5,25,557
  • యాక్టివ్​ కేసులు: 1,36,076
  • కోలుకున్నవారి సంఖ్య: 4,30,28,356

Vaccination India: భారత్​లో బుధవారం 13,44,714 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,27,27,559కి చేరింది. మరో 3,94,774 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated :Jul 14, 2022, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.