ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 26,291 మందికి కరోనా​

author img

By

Published : Mar 15, 2021, 9:47 AM IST

దేశంలో ఒక్కరోజే 26 వేల 291 మంది కరోనా బారినపడ్డారు. మరో 118 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య లక్షా వేల కు చేరింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 17 వేల 450 మందికిపైగా కోలుకున్నారు

india corona cases daily update
దేశంలో కొత్తగా 26,291 మందికి కరోనా​

భారత్​లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 26,291 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య కోటీ 13 లక్షల 85 వేలు దాటింది. మహమ్మారికి ధాటికి మరో 118మంది బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,13,85,339
  • యాక్టివ్​ కేసులు: 2,19,262
  • మరణాలు: 1,58,725
  • కోలుకున్నవారు: 1,10,07,352

ఆదివారం మరో 17,455 మంది వైరస్​ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,99,08,038 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు చెప్పింది.

2021, మార్చి 14 వరకు మొత్తం.. 22,74,07,413 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 7,03,772 నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది.

ఇదీ చూడండి:'మాస్క్ లేకపోతే విమానం నుంచి దించేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.