ETV Bharat / bharat

హైకోర్టు న్యాయమూర్తులుగా భార్యాభర్తలు.. అక్కడ తొలిసారి

author img

By

Published : Jun 4, 2022, 8:13 PM IST

Judge couple: రాజస్థాన్ హైకోర్టులో తొలిసారి భార్యాభర్తలిద్దరూ న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. జస్టిస్​ మహేంద్ర గోయల్​ ఇప్పటికే ఈ హైకోర్టులో జడ్జిగా ఉండగా.. ఆయన సతీమణి జస్టిస్ శుభా మెహ్తాను కొత్త జడ్జిగా నియమించింది కేంద్ర న్యాయశాఖ.

Rajasthan HC
హైకోర్టు న్యాయమూర్తులుగా భార్యాభర్తలు.. అక్కడ తొలిసారి

Rajasthan HC: రాజస్థాన్​ హైకోర్టులో అరుదైన ఘటన జరిగింది. తొలిసారి భార్యాభర్తలు న్యాయమూర్తులుగా సేవలందించనున్నారు. కేంద్ర న్యాయశాఖ శుక్రవారం జస్టిస్ కుల్దీప్​ మథూర్​, జస్టిస్​ శుభా మెహ్తాలను రాజస్థాన్ హైకోర్టు జడ్జీలుగా నియమించింది. అయితే జస్టిస్​ శుభా మెహ్తా భర్త జస్టిస్​ మహేంద్ర గోయల్​ ఇప్పటికే ఈ హైకోర్టులోనే జడ్జిగా ఉన్నారు. దీంతో ఇకపై ఇద్దరు ఒకే కోర్టులో న్యాయమూర్తులుగా ఉండనున్నారు. కొత్తగా నియమించిన ఇద్దరు జడ్జిలతో కలిపి రాజస్థాన్​ హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య 25 నుంచి 27కు పెరిగింది. మొత్తం జడ్జిల సంఖ్య 50 కాగా.. ఇంకా 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

2020 డిసెంబర్​లో మద్రాసు హైకోర్టులోనూ జస్టిస్ మురళీశంకర్ కొప్పురాజుతో పాటు ఆయన భార్య జస్టిస్​ తమిళ్​సెల్వి టీ వలయపాలయమాండ్ ఒకేసారి న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2019 నవంబర్​లోనూ పంజాబ్​ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ వివేక్​ పూరి, ఆయన సతీమణి జస్టిస్​ అర్చన పూరి ఒకే రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు రాజస్థాన్​లోనూ భార్యాభర్తలు జడ్జీలుగా ఉన్నారు.

ఇదీ చదవండి: మైనారిటీ చట్టం నిబంధనలు సవాల్​ చేస్తూ సుప్రీంలో పిటిషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.