ETV Bharat / bharat

కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి

author img

By

Published : May 11, 2021, 12:55 PM IST

కుటుంబ సభ్యులకు తమ నుంచి కరోనా సోకుతుందేమోనన్న భయంతో కర్ణాటకలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ వృద్ధురాలు ఉరేసుకొని చనిపోగా.. మరో వ్యక్తి తుపాకీతో కాల్చుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు.

'I might spread corona virus to my Family' - Two people commiited suicide in two separate cases
కరోనా భయం- తుపాకీతో కాల్చుకొని మృతి

కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందేమోనని ఓ విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కర్ణాటక చిక్కమగళూరులోని బెలెనహళ్లి గ్రామానికి చెందిన సోమనాయక్​కు.. కొద్దిరోజుల క్రితం కరోనా వచ్చింది. దీంతో సూసైడ్ నోట్ రాసి కారులోనే బలన్మరణానికి పాల్పడ్డాడు. తన కుటుంబానికి కరోనా అంటుకుంటుందేమోనన్న భయంతోనే తనువు చాలిస్తున్నట్లు నోట్​లో పేర్కొన్నాడు.

fear of spread corona virus to my Family one dead
కారులోనే ఆత్మహత్య చేసుకున్న సోమనాయక్
'I might spread corona virus to my Family' - Two people commiited suicide in two separate cases
సోమనాయక్ మృతదేహం

మరోవైపు, చామరాజనగర్ జిల్లా కొల్లెగల్ తాలుకాలో సైతం ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఇక్కడహళ్లి గ్రామానికి చెందిన 70ఏళ్ల సిద్ధమ్మకు మే 1న కొవిడ్ సోకింది. వైద్యుల సిఫార్సు మేరకు ఆ వృద్ధురాలు హోంక్వారంటైన్​లో ఉంది. అయితే, ఇంట్లోని చిన్నపిల్లలకు తన నుంచి కరోనా సోకుతుందన్న భయంతో మే 3న ఉరేసుకుని చనిపోయింది.

women suicide in fear of spreading covid
ఉరేసుకొని చనిపోయిన వృద్ధురాలి కుటుంబ సభ్యులు

ఇదీ చదవండి: ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.