ETV Bharat / bharat

సీఎం సెక్యూరిటీ సిబ్బందితో ఎస్పీ ఫైటింగ్​

author img

By

Published : Jun 23, 2021, 11:06 PM IST

ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారికి, ఎస్పీకి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో సీఎం సెక్యూరిటీని చెంపదెబ్బ కొట్టారు ఎస్పీ. ఈ ఘటన హిమాచల్​ ప్రదేశ్​లో జరిగింది. అసలేం జరిగిందంటే...

kullu, SP
కుల్లు జిల్లా, ఘర్షణ

అధికారుల మధ్య ఘర్షణ

హిమాచల్​ప్రదేశ్​లో ఇద్దరు అధికారుల మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. భుంతర్​ విమానాశ్రయం వద్ద.. కులు జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సెక్యూరిటీ ఆఫీసర్​ మధ్య వివాదం తీవ్రమైంది. ఈ క్రమంలో సెక్యూరిటీ అధికారిని చెంపదెబ్బ కొట్టారు కులు ఎస్పీ.

దీనిపై ఆగ్రహించిన సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గౌరవ్​ సింగ్​పై తిరిగి చేయి చేసుకున్నారు. అయితే.. సమీపంలో ఉన్న పోలీసులు అధికారులు వెంటనే పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

గడ్కరీ కాన్వాయ్​ను అడ్డుకున్న రైతులు..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆహ్వానం పలికేందుకు భుంతర్ విమానాశ్రయానికి వెళ్లారు జైరాం ఠాకూర్. అయితే.. గడ్కరీ ఎయిర్​పోర్టు నుంచి బయలుదేరిన వెంటనే కిసాన్ సంఘ్​కు చెందిన కొందరు రైతులు మంత్రి కాన్వాయ్​ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులతో ముఖ్యమంత్రి ఠాకూర్, గడ్కరీ రైతులతో మట్లాడారు.

తమ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న ఫోర్​ లేన్ రోడ్డు కోసం ప్రభుత్వం కొందరు రైతులకు పరిహారం ఇస్తోంది. అయితే.. ఈ పరిహారాన్ని మరింత పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని గడ్కరీ.. ముఖ్యమంత్రికి తెలిపారు.

ఇదీ చదవండి:రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతున్న అంతర్జాతీయ షూటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.