ETV Bharat / bharat

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కేసు - ఎంత స్థలం కేటాయించారో వివరాలివ్వండి: హైకోర్టు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 3:55 PM IST

Updated : Jan 12, 2024, 4:06 PM IST

High Court Hearing on Shifting of Offices to Visakhapatnam: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో అమరావతి నుంచి విశాఖకు కార్యాలయాలను తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High Court
High Court

High Court Hearing on Shifting of Offices to Visakhapatnam: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో అమరావతి నుంచి విశాఖకు కార్యాలయాలను తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విశాఖలో దేనికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏఏ అవసరాలకు ఎంత పరిధిలో భవనాలు నిర్మించారో చెప్పాలంది. స్థలాలు, భవనాల వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది. సమావేశాల కోసమే విశాఖలో కార్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది.

Last Updated : Jan 12, 2024, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.