ETV Bharat / bharat

279 మందిని చంపి.. రూ.11కోట్లు సంపాదించిన క్లర్క్.. అంతా 'నకిలీ' మాయ!

author img

By

Published : Nov 17, 2022, 12:10 PM IST

revenue office
తహసీల్దారు కార్యాలయం

గుజరాత్​లో ఓ వ్యక్తి 279 మందిని చంపి రూ.11.26 కోట్లు సంపాదించాడు! నకిలీ పత్రాలను తయారు చేసి.. సర్కారు ఖజానాను కొల్లగొట్టాడు. అసలేం జరిగిందంటే..?

ఫోర్జరీ పత్రాలతో గుజరాత్​లో ఓ క్లర్క్ సర్కారు ఖజానాను కొల్లగొట్టాడు. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి ఏకంగా రూ.11.26 కోట్లను కాజేశాడు. అసలేమైందంటే..
నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు, పాముకాటు లేదా ఇతర కారణాల వల్ల ఏ వ్యక్తి అయినా మరణిస్తే.. రెవెన్యూ శాఖలోని రిలీఫ్ బ్రాంచ్.. బాధిత కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తుంది. అయితే, సూరత్ జిల్లా​కు సమీపంలో తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న సచిన్ అనే వ్యక్తి.. బతికున్న వ్యక్తులు చనిపోయారని నకిలీ వివరాలు అప్లోడ్ చేసి.. కొత్త స్కామ్​కు తెరతీశాడు. ఏకంగా 279 మంది చనిపోయినట్లు నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు. మొత్తం 40 బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.11.26 కోట్లు సంపాదించాడు.

విషయం ఎలా బయటపడిందంటే..
ఆఫీసులో కొన్ని అవకతవకలు జరిగినట్లు అనుమానాలు రాగా.. రెవెన్యూ డిపార్ట్​మెంట్ ఆడిట్ నిర్వహించింది. అప్పటి నుంచి సచిన్ ఆఫీసుకు రావటం మానేశాడు. దీంతో అతని అల్మారాలో వెతకగా నగదుకు సంబంధించిన కొన్ని ఆర్డర్ పత్రాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా.. అర్హత లేని వారి ఖాతాల్లో డబ్బులు జమా అయినట్లు తెలిసింది. మొత్తం 40 ఖాతాలు గుర్తించగా.. అందులో కొన్ని అకౌంట్లలో రెండు, మూడుసార్లు నగదు జమా అయినట్లు తేలింది. నిందితుడు ఎనిమిది వేర్వేరు బ్యాంకులకు చెందిన 40 ఖాతాల ద్వారా రూ.11.26 కోట్లు సంపాదించినట్లు అధికారులు తెలిపారు. ఆర్డర్‌లోని లెటర్‌హెడ్, సీల్, సంతకం అన్నీ నకిలీవేనని చెప్పారు. ప్రస్తుతం సచిన్​కు సంబంధించిన ఇతర పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.