ETV Bharat / bharat

మీ పేరు అదేనా? అయితే పెట్రోల్, మీల్స్​​ ఫ్రీ!

author img

By

Published : Aug 10, 2021, 10:11 AM IST

Updated : Aug 10, 2021, 7:53 PM IST

Petrol Pump Offers Free Fuel To People Named Neeraj
ఆఫర్​ ప్రకటించినట్లు పెట్టిన బోర్డు

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. ఓ పేరు గల వ్యక్తులకు మాత్రం పెట్రోల్​ ఉచితంగా లభిస్తోంది. అంతేకాదు క్షౌరం ఫ్రీగా చేస్తున్నారు. ఎందుకంటే ఆ పేరున్న వ్యక్తి గడించిన ఘనత అలాంటిది మరి. ప్రపంచ వేదికపై దేశం గర్వపడేలా చేసిన.. అతని పేరు ఉన్నవాళ్లకు బంపర్​ ఆఫర్​ ప్రకటించాడు గుజరాత్​లోని ఓ పేట్రోల్​ బంకు యజమాని. ఆ పేరేమిటో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందా? అయితే ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే!

పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన వేళ.. గుజరాత్​కు చెందిన ఓ పెట్రోలు బంకు యజమాని బంపర్​ ఆఫర్​ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్​లో సత్తా చాటి స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై.. వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్‌లోని తన పెట్రోలు బంకులో.. నీరజ్ పేరుతో ఉన్న వారికి రూ.501 పెట్రోలు ఉచితంగా కొట్టించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. భరూచ్​ జిల్లా నేత్రాంగ్​​-మోవి రోడ్డులోని ఎస్‌పీ పెట్రోల్ పంపు యజమాని అయూబ్​ పఠాన్​. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్​ను అందుబాటులో ఉంచాడు. అయితే నీరజ్ అని రుజువు చేసుకునేందుకు ఆధార్ జిరాక్స్‌ను ఆ పెట్రోలు బంకులో ఇవ్వాలని నిబంధన పెట్టాడు.

Petrol Pump Offers Free Fuel To People Named Neeraj
పెట్రోల్ ఫ్రీ కొడుతున్న దృశ్యం
Petrol Pump Offers Free Fuel To People Named Neeraj
పుష్పగుచ్ఛం ఇస్తున్న పెట్రోల్​ బంకు సిబ్బంది
Petrol Pump Offers Free Fuel To People Named Neeraj
ఆఫర్​ ప్రకటించినట్లు పెట్టిన బోర్డు

కటింగ్​ ఫ్రీ

నేత్రాంగ్‌లోని పెట్రోల్​ పంపు యజమాని ఉచిత పెట్రోల్‌ను ప్రకటించిన తర్వాత, అంకలేశ్వర్‌లోని సెలూన్​ యజమాని కూడా నీరజ్​ అనే పేరున్న వ్యక్తులకు ఉచిత హెయిర్‌కట్ చేస్తానని ఆఫర్​ ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. "దేశంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి. అందులో క్రికెట్​కే విపరీతంగా ఆదరణ లభిస్తుంది. అయితే నీరజ్​ చోప్రా.. భారత్​​ తరఫున స్వర్ణం సాధించినందుకు గర్వంగా ఉంది. కాబట్టి ఈ క్రీడను ప్రోత్సాహంచేందుకు.. నీరజ్​ అనే వ్యక్తులకు ఈ ఆఫర్​ ప్రకటించాను" అని తెలిపాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా ఒక్కరోజులోనే హీరోగా మారిపోయాడు. జావెలిన్​ త్రో ఫైనల్లో ఈటెను 87.58 మీటర్లు విసిరారు నీరజ్. అథ్లెటిక్స్‌లో భారత్‌ వందేళ్ల పతక నిరీక్షణకు తెరదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నీరజ్ చోప్రా పేరు మార్మోగిపోయింది.

రెస్టారెంట్​లో ఫుడ్​ ఫ్రీ..

ఇక కర్ణాటకలోని షిరాలి జిల్లాలోని 'తమ్రా' రెస్టారెంట్ సైతం ఇదే తరహా ఆఫర్​ను ప్రకటించి వార్తల్లో నిలిచింది. టోక్యో విశ్వక్రీడల్లో భారత్​ తరఫున స్వర్ణపతాకాన్ని ముద్దాడిన నీరజ్​ చోప్డాకు వినూత్నంగా అభినందనలు తెలిపింది. నీరజ్ అనే పేరు ఉన్న వ్యక్తులకు ఉచిత భోజనాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు ఉంటుందని తెలిపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా విపరీత ప్రచారం చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటోంది. ఈ మేరకు 'తమ్రా' రెస్టారెంట్ యజమాని ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

neeraj chopra
హైవేపై తమ్రా రెస్టారెంట్
neeraj chopra
రెస్టారెంట్​లోని లోపలి దృశ్యాలు

నీరజ్ అనే పేరు గల వ్యక్తి తమ పేరును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను తగిన రుజువు చూపించాలి. ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు ఫోన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు.

-ఆశిష్ నాయక్, తమ్రా రెస్టారెంట్

neeraj chopra
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న తమ్రా రెస్టారెంట్ ప్రకటన

ఈ రెస్టారెంట్ సీ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందింది.

ఇవీ చూడండి:

Last Updated :Aug 10, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.