ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వ్యాక్సిన్ పాలసీ ప్రకటించిన నేపథ్యంలో 44 కోట్ల టీకా డోసులను కేంద్రం కొనుగోలు చేసింది. ఈ డోసులను ఆగస్టు-డిసెంబరు నెలల మధ్య ఉత్పత్తిదారులు పంపిణీ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సీరం సంస్థ నుంచి 25 కోట్ల డోసులను కొవిషీల్డ్లను, భారత్ బయోటెక్ నుంచి 19 కోట్ల కొవాగ్జిన్ డోసులకు ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీకా డోసుల కొనుగోలుకు అయ్యే మొత్తంలో 30 శాతాన్ని ఉత్పత్తి సంస్థలకు చెల్లించామని స్పష్టం చేసింది.
18 ఏళ్ల దాటిన వారికి టీకా అందించేందుకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. ఈ పంపిణీ జూన్ 21 నుంచి ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'ఉచిత వ్యాక్సిన్, రేషన్ ఖర్చు రూ. 1.45 లక్షల కోట్లు'