ETV Bharat / bharat

స్కూల్​ బస్సు- కారు ఢీ.. ఆరుగురు మృతి.. రాంగ్ రూట్​లో రావడం వల్లే..

author img

By

Published : Jul 11, 2023, 10:43 AM IST

Updated : Jul 11, 2023, 11:42 AM IST

road accident in ghaziabad yesterday
road accident in ghaziabad yesterday

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని మేరఠ్​-దిల్లీ ఎక్స్​ప్రేస్​వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు వేగంగా వచ్చి కారును ఢీ కొట్టడం వల్ల ఆరుగురు మరణించారు.

స్కూల్​ బస్సు-కారు ఢీ లైవ్ వీడియో

స్కూల్ బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో మేరఠ్​-దిల్లీ ఎక్స్​ప్రేస్​వేపై జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా మహిళలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పాఠశాల బస్సు రాంగ్​ రూట్​లో అతి వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. బస్సులో పిల్లలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రెండు వాహనాలను తొలగించిన పోలీసులు.. ట్రాఫిక్​ను పనురుద్ధరించారు.

"దిల్లీ-మేరఠ్​ ఎక్స్​ప్రెస్​వేపై మంగళవారం ఉదయం 6 గంటలకు ఓ కారు-స్కూల్ బస్సు ఢీ కొన్నాయి. గాజీపుర్ వద్ద బస్సులో సీఎన్​జీ నింపించుకున్న​ డ్రైవర్ రాంగ్ రూట్​లో వస్తున్నాడు. ఈ క్రమంలోనే మేరఠ్​ నుంచి వస్తున్న ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నాం. బస్సు డ్రైవర్​ రాంగ్ రూట్​లో రావడమే ప్రమాదానికి ప్రధాన కారణం."
-రమానంద్​ కుశ్వాహ, ఏడీసీపీ ట్రాఫిక్​

12కు చేరిన ట్యాంకర్​ మృతుల సంఖ్య
Uttar Pradesh Accident Today : ఓ ట్యాంకర్.. లగేజ్​ వ్యాన్​పై బోల్తా కొట్టిన ఘటనలో మృతుల సంఖ్య 12 మందికి చేరింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​లో సోమవారం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రతాప్​గఢ్​ మెడికల్ కాలేజీకి తరలించారు.

ఇదీ జరిగింది
15 మంది ప్రయాణికులతో ఓ లగేజీ వ్యాన్​ ప్రతాప్​గఢ్​ వైపు వెళ్తోంది. అదే సమయంలో ఓ ట్యాంకర్​ మోహన్​గంజ్​ నుంచి వస్తోంది. ఇంతలో ఆ ట్యాంకర్ అదుపుతప్పి లగేజీ వ్యాన్​పై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లగేజీ వ్యాన్​లో ఉన్న 12 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ పోలీసులు.. ప్రతాప్​గఢ్ మెడికల్ కాలేజీకి తరలించారు. మరోవైపు.. ప్రతాప్​గఢ్ రోడ్డు ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు.. రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

ఇవీ చదవండి : Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

లగేజ్​ వ్యాన్​పై ట్యాంకర్ బోల్తా.. 8 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

Last Updated :Jul 11, 2023, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.