ETV Bharat / bharat

పాఠశాల సిబ్బందిపై విద్యార్థినుల అత్యాచార ఆరోపణలు.. కానీ!

author img

By

Published : Dec 8, 2021, 7:38 PM IST

gangrape news
అత్యాచార ఆరోపణలు

Gangrape Latest News: రాజస్థాన్​లోని అల్వార్​ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బందిపై అత్యాచార ఆరోపణలు చేశారు ఐదుగురు బాలికలు. ప్రిన్సిపల్​ సహా మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Gangrape Latest News: స్కూల్​ టీచర్లు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ ఐదుగురు బాలికలు పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు ప్రిన్సిపల్​ సహా 15 మంది టీచర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన రాజస్థాన్​లోని అల్వార్ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

ఫిర్యాదుపై సందేహాలు..

ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికలు ఇచ్చిన ఫిర్యాదుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు.

"ఇది.. ఈ స్కూల్లో పనిచేసిన మాజీ ఉపాధ్యాయుడు చేపట్టిన ప్రతీకార చర్యగా మేము భావిస్తున్నాం. అత్యాచారానికి గురయ్యామని పేర్కొంటున్న బాలికలకు పరీక్షలు నిర్వహించేందుకు వారి తల్లిదండ్రులు నిరాకరించారు. ప్రిన్సిపల్​ సహా మొత్తం స్కూల్​ స్టాఫ్​పైన స్థానిక పోలీస్​ స్టేషన్​లో మంగళవారం రాత్రి మూడు ఎఫ్​ఐఆర్​లను నమోదు చేశాం. మహిళా ఉపాధ్యాయుల సాయంతో టీచర్లు తమపై అత్యాచారానికి పాల్పడేవారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతాం."

-రామ్​మూర్తి జోషి, ఎస్పీ

ప్రతీకార చర్య!

గతేడాది డిసెంబరులో ఈ పాఠశాలకు చెందిన ఓ టీచర్​.. ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కారణంగా అరెస్ట్​ అయ్యాడు. ఆ సమయంలో ప్రస్తుతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ఆ టీచర్​కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు. నిందితుడు ఇటీవల బెయిల్​పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్​లో ఉన్న నిందితుడు స్కూల్​స్టాఫ్​పై ప్రతీకార చర్యగా ఇందంతా చేస్తున్నాడనే అనుమానం వ్యక్తం అవుతోందంటున్నారు పోలీసులు.

11 ఏళ్ల బాలికపై అత్యాచారం

రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​ జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన ఓ 11 ఏళ్ల బాలిక ఈనెల 2న బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తున్నారు.

'బాధితురాలి బంధువు, నిందితుడు గుజరాత్​లో కలిసి పనిచేసే వారు. గతేడాది లాక్​డౌన్​ సమయంలో నిందితుడు బాధితురాలి ఇంటికి వచ్చాడు. అప్పటినుంచి అక్కడే ఉంటూ బాలికపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు' అని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : 17మంది బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. భోజనంలో మందు కలిపి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.