17మంది బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. భోజనంలో మందు కలిపి...

author img

By

Published : Dec 7, 2021, 3:24 PM IST

Muzaffarnagar crime news

UP molestation news: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈటీవీ భారత్​ కథనంపై స్పందించిన ఉత్తర్​ప్రదేశ్​ మహిళా కమిషన్​.. ఈ ఘటనను సుమోటోగా పరిగణించింది.

ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​లో గత నెల 18న.. ప్రాక్టికల్స్​ పరీక్షలు రాసేందుకు ఓ పాఠాశాల ప్రిన్సిపల్​.. 17మంది బాలికలను వేరే స్కూలుకు తీసుకెళ్లాడు. బాలికలు ఆ రోజు రాత్రి అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో మరొకరితో కలిసి ఆ ప్రిన్సిపల్​ వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాలికలకు ఇచ్చే ఆహారంలో మత్తుమందు కలిపి.. వారిపై అత్యాచారానికి కూడా ప్రయత్నించినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, కుటుంబసభ్యులను చంపేస్తామని వారు బెదిరించారు. చివరకు ధైర్యం చేసి.. ఈ వివరాలను బాలికలు వారి తల్లిదండ్రులకు చెప్పారు.

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. స్థానిక భాజపా ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వల్ జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు చెబుతున్నారు. అప్పుడే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందిన వెంటనే.. ఈటీవీ భారత్​ ఉత్తర్​ప్రదేశ్​ ఈ వార్తను ప్రచురించింది. తాజాగా.. ఈ వార్త ఆధారంగా ఉత్తర్​ప్రదేశ్​ మహిళా కమిషన్​ చర్యలు చేపట్టింది. కేసుకు సంబంధించి.. అన్ని వివరాలను తమకు చెప్పాలని ముజఫర్​నగర్​ జిల్లా మెజిస్ట్రేట్​ను ఆదేశించింది. ఈటీవీ భారత్​ వార్త ఆధారంగా ఘటనను సుమోటాగా పరిగణిస్తున్నామని లేఖ రాసింది.

Muzaffarnagar crime news
ఉత్తర్​ప్రదేశ్​ మహిళా కమిషన్​ రాసిన లేఖ

ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అయిదు బృందాలను ఏర్పాటు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్‌ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేసినట్లు ముజఫర్‌నగర్‌ ఎస్ఎస్పీ అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు

ఇదీ చూడండి:- చెల్లెలిపై మూడు నెలలుగా అన్న అత్యాచారం.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.