ETV Bharat / bharat

G20 Summit Kharge : ఖర్గేను జీ20కి ఆహ్వానించకపోవడంపై రాహుల్ ఫైర్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 3:25 PM IST

Updated : Sep 8, 2023, 3:55 PM IST

G20 Summit Kharge Rahul
G20 Summit Kharge Rahul

G20 Summit Kharge Rahul : భారతదేశ జనాభాలో 60 శాతం మందికి నాయకులైన వారిని పాలకులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను జీ20 విందుకు పిలవకూడదని కేంద్రం ముందే నిర్ణయించుకుందని విమర్శించారు.

G20 Summit Kharge Rahul : దేశ రాజధాని దిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ నేత రాహుల్​ గాంధీ స్పందించారు. "ప్రతిపక్ష నేతను ఆహ్వానించకూడదని వారు(కేంద్ర ప్రభుత్వం) ముందే నిర్ణయించుకున్నారు. భారతదేశ జనాభాలో 60 శాతం మందికి నాయకులైన వారిని పట్టించుకోరు. అసలెందుకు వారు అలా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి" అని రాహుల్​ అన్నారు.

  • VIDEO | "They have decided not to invite the Leader of Opposition. It tells you that they don't value the leader of 60 per cent of India's population," says Congress MP @RahulGandhi on party president Mallikarjun Kharge not being invited to G20 dinner hosted by the President. pic.twitter.com/9rxSvW76o3

    — Press Trust of India (@PTI_News) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'దేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం..'
దేశంలోని దళితులు, గిరిజనులు, మైనారిటీలు.. దాడికి గురవుతున్నారని రాహుల్​ గాంధీ ఆరోపించారు. భారతదేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అధికారం, సంపద కేంద్రీకృతం కావాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్​ దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌.. బ్రస్సెల్స్‌లోని ప్రెస్​క్లబ్​లో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.

  • VIDEO | "The democratic structures of the country are under attack from a group of people who are running India," says Congress leader @RahulGandhi while interacting with international media at Brussels Press Club, Belgium. pic.twitter.com/iLp3PnJL7F

    — Press Trust of India (@PTI_News) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఆర్టికల్ 370పై కాంగ్రెస్​ వాదన స్పష్టం'
Congress Article 370 : "ఆర్టికల్​ 370పై మా వాదన స్పష్టంగా ఉంది. మన దేశంలో ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అందుకే తమ భావాలను తెలిపేందుకు అందరినీ అనుమతించాలని మేం అనుకుంటున్నాం. కశ్మీర్​ అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. అక్కడ శాంతి నెలకొనాలని భావిస్తున్నాం" అని రాహుల్​ తెలిపారు.

'హింస విపరీతంగా పెరుగుతోంది..'
Rahul On Democracy : దేశంలో ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తిస్థాయి దాడి జరుగుతోందని.. అది అందరికీ తెలుసు అని రాహుల్​ అన్నారు. వివక్ష, హింస విపరీతగా పెరుగుతోందని ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్ర ప్రభుత్వ వైఖరితో ప్రతిపక్షాలన్నీ ఏకీభవిస్తున్నాయిని తెలిపారు.

Rahul Gandhi Europe Tour : భారత్​లో నవాబ్​ కావడానికి.. విదేశీ శక్తుల సహాయం కోరుతూ రాహుల్​ విదేశాలకు​ వెళ్తున్నారని గతంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆ సమయంలో వారు చాలా ఆందోళన చెంది అలాంటి వ్యాఖ్యలు చేశారని రాహుల్​ తెలిపారు. భారత్- ఐరోపా సంబంధాలు, మారుతున్న వాతావారణ పరిస్థితులు, ఆర్థిక సవాళ్లపై కొందరు ఐరోపా పార్లమెంటేరియన్లతో తాను ఫలప్రదమైన చర్చలు జరిపానని ఆయన చెప్పారు.

Rahul Europe Visit : అయితే, జీ-20 సమావేశాల వేళ రాహుల్‌ ఐరోపా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. పలు దేశాల అధినేతలు ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో రాహుల్‌ విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఆయన భారత్‌లో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ.. విదేశాల్లో పర్యటించారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

'4 నెలలుగా మణిపుర్​ తగలబడుతుంటే.. పార్లమెంట్​లో మోదీ జోకులా?'

'చైనా ఆక్రమణలో భారత భూభాగం'.. రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. కేంద్ర మంత్రి కౌంటర్

Last Updated :Sep 8, 2023, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.