ETV Bharat / bharat

భారత సత్తా చాటేలా జీ20.. ఆ విషయంలో విజయం.. ఉమ్మడి ప్రకటన సంగతేంటి?

author img

By PTI

Published : Sep 8, 2023, 7:20 PM IST

G20 Summit 2023 Delhi India
G20 Summit 2023 Delhi India

G20 Summit 2023 Delhi India : భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. దిల్లీ వేదికగా శనివారం, ఆదివారం జరిగే ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. జీ-20 సదస్సుకు తొలిసారి ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత సంప్రదాయాలు, సామర్థ్యాలను ప్రపంచానికి చాటాలని భావిస్తోంది. సమావేశాలు పూర్తైన తర్వాత వెలువడే సంయుక్త ప్రకటనపై సందిగ్ధం నెలకొంది. అయితే, డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.

G20 Summit 2023 Delhi India : భారత్‌ అధ్యక్షతన దిల్లీ వేదికగా శనివారం, ఆదివారం జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం.. దీని ద్వారా భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాలని సంకల్పించుకుంది. దిల్లీలోని ప్రగతి మైదానంలో రెండురోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లు విసిరే పరిణామాలు ఉన్న ప్రస్తుత సమయంలో ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జీ20 సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. తొలిసారి ఈ సదస్సును భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. దిల్లీ నగరాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేసింది.

G20 Bharat Mandapam Pragati Maidan : దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అందుకు వేదికైన భారత మండపం ముస్తాబైంది. భారత దేశ విభిన్న సంస్కృతిని తెలిపేలా.. ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద తయారు చేసిన హస్తకళలు, కళాఖండాలతో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ సాధించిన పురోగతిని తెలిపేలా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిణామం చెందిన తీరును ప్రదర్శించే స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్​లోని భదోహి నుంచి తెప్పించిన ప్రత్యేక తివాచీలను ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటేలా వేదిక సిద్ధం చేశారు.

  • VIDEO | Visuals of stalls inside Bharat Mandapam, the venue of G20 Summit in Delhi, scheduled to be held on September 9-10. pic.twitter.com/yQtsL2INKG

    — Press Trust of India (@PTI_News) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | G 20 in India | Delhi: Spouses of G 20 leaders participating in the New Delhi Summit will visit the National Gallery of Modern Art (NGMA ), which will be showcasing traditional earrings & jewellery, quilts and Pashmina shawls.

    Wrap Studio CEO Siddharth Saigal says, "We… pic.twitter.com/saZaF9Q5rw

    — ANI (@ANI) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మహాత్ముడి స్ఫూర్తితో..
PM Modi Message Before G20 Summit : మానవ కేంద్రీకృత, సమ్మిళిత అభివృద్ధికి ఈ జీ20 సమావేశం సరికొత్త మార్గాన్ని చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు, సమాజంలోని ప్రతి వ్యక్తికీ సేవలందించాలన్న మహాత్మా గాంధీ ఆశయం ఇందులో ఉంటుందన్నారు. భారత జీ20 ప్రెసిడెన్సీ.. కార్యాచరణే లక్ష్యంగా సాగిందని గుర్తు చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి వేగం పెంచాల్సిన అవసరం ఉందని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

G20 Summit 2023 Delhi India
భారత్ మండపం

కీలక అంశంపై విజయం!
India G20 African Union : ఈ సమావేశంలో జీ20 విస్తరణ దాదాపు ఖాయమైంది. ఆఫ్రికా సమాఖ్యకు జీ20 సభ్యత్వం ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆఫ్రికా యూనియన్‌ చేరిక తర్వాత జీ20 గ్రూపు పేరును జీ-21గా మారుస్తారా లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ప్రకటన వెలువడితే జీ-20లో పేద దేశాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లవుతుంది. భారత్‌ అధ్యక్షతన ఈ గ్రూపుపై చెరగని ముద్ర వేసినట్లవుతుంది.

G20 Summit 2023 Delhi India
జీ20 ఏర్పాట్లు

సంయుక్త ప్రకటన ఉంటుందా?
G20 Declaration 2023 India : అయితే, శిఖరాగ్ర సదస్సు అనంతరం సంయుక్త ప్రకటన ఉంటుందా లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రధాన సమస్యలపై ఇప్పటికీ సభ్య దేశాల మధ్య సయోధ్య కుదరలేదు. పాశ్చాత్త దేశాలకు, రష్యా- చైనాలకు మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో సంయుక్త ప్రకటన వెలువడటంపై సందేహాలు నెలకొన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై బలంగా స్పందించాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ఆర్థిక విషయాలపై కాకుండా.. జీ20 సదస్సులో వాటిని ఎందుకు ప్రస్తావిస్తారని రష్యా, చైనా వాదిస్తున్నాయి.

G20 Summit 2023 Delhi India
భారత్ మండపంలోని సాంస్కృతిక నడవా

డిక్లరేషన్ సిద్ధం: కేంద్రం
కాగా.. డిక్లరేషన్​ దాదాపు సిద్ధమైందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ అంశాలపై జీ20 అగ్రనేతల వ్యక్తిగత ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం వరకు చర్చలు జరిపారు. తర్వాత ప్రధాన వేదిక వద్ద డిక్లరేషన్‌పై చర్చలు జరపనున్నారు. డిక్లరేషన్‌లోని పేరా-6పై ప్రధానంగా గొడవ జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రస్తావించాలని ఒకవర్గం పట్టుపడుతుండగా.. మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పర్యావరణ మార్పుల అంశంపైనా సయోధ్య కుదరలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో 55 మంది సభ్యులతో కూడిన ఆఫ్రికా యూనియన్‌ చేరికపైనే రష్యా, చైనా సహా అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటన ఎలా ఉంటుందనేది తేలాల్సి ఉంది. సంయుక్త ప్రకటన వెలువడకపోతే.. సదస్సుకు సంబంధించిన సారాంశ ప్రకటనను విడుదల చేస్తారు.

డిక్లరేషన్​లో వారికి పెద్దపీట
గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలను ప్రతిబింబించే విధంగా డిక్లరేషన్ ఉంటుందని భారత జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను వేగవంతం చేయడం, పర్యావరణం, క్లైమెట్ ఫైనాన్స్, హరిత అభివృద్ధి, పోషకాహారం వంటి వివిధ అంశాలను భారత్ కీలకంగా పరిగణిస్తోందని తెలిపారు. "సదస్సు పూర్తైన తర్వాత మీరు చూసే డిక్లరేషన్​లో గ్లోబల్ సౌత్ దేశాల అభిప్రాయాలు కనిపిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలకు అంతటి ప్రాధాన్యం ఇస్తూ జారీ అయిన డిక్లరేషన్ ప్రపంచంలోనే ఇంకోటి ఉండదనేలా ఈ ప్రకటన ఉంటుంది" అని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.

G20 Summit 2023 Delhi India
భారత్ మండపం

ఏంటీ జీ20?
G20 Countries Names : జీ-20 దేశాల కూటమి.. ప్రభుత్వాల కలయికతో ఏర్పడిన వేదిక. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌ ఉంటాయి. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పుల తీవ్రత తగ్గింపు, సుస్థిరాభివృద్ధి వంటి అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ప్రధాన సవాళ్లను అధిగమించేందుకు ఈ కూటమి పనిచేస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు జీ-20 కూటమిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థూల ఉత్పాదకతలో 80శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింటి రెండో వంతు, ప్రపంచ విస్తీర్ణంలో 60శాతంగా ఉన్నాయి.

ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో 1999లో జీ-20 దేశాల కూటమి ఏర్పాటైంది. అయితే 2008 నుంచి ఏడాదికోసారి సమావేశం కావటం ప్రారంభమైంది. సభ్య దేశాల తరఫున ప్రభుత్వ అధినేత లేదా ఆర్థికమంత్రి లేదా విదేశాంగశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఇతర దేశాలు, అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు, నాన్-గవర్నమెంటల్ సంస్థలను కూడా జీ-20 సదస్సులకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. కొన్నింటికి శాశ్వత ఆహ్వానం ఉంటుంది.

ఈ ఏడాది రొటేషన్‌ పద్ధతిలో జీ-20 సదస్సుకు దిల్లీ వేదిక అయింది. గతేడాది 2022లో ఇండోనేషియాలో ఈ సమావేశాలు జరిగాయి. దిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించనుంది. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య ఆర్థిక ప్రగతిని విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలపై జీ-20 దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఈ సమావేశాల చివరిరోజు భారత్‌ జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది.

Rishi Sunak G20 India Visit : భార్యతో కలిసి దిల్లీకి రిషి సునాక్​.. ఈ దేశపు అల్లుడిగా ఈ ట్రిప్​ తనకెంతో స్పెషల్​ అన్న ప్రధాని!

G20 Bilateral Meetings : మూడు రోజులు బిజీబిజీగా మోదీ.. 15కి పైగా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు.. షెడ్యూల్​ ఇదే!

G20 Security Arrangements : డ్రోన్లు, బోట్లు, వేల మంది సిబ్బంది.. దిల్లీలో హైలెవల్ సెక్యూరిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.