ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- నలుగురు ముష్కరులు హతం

author img

By

Published : Feb 24, 2021, 12:11 PM IST

Updated : Feb 24, 2021, 12:50 PM IST

encounter in Anantnag
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- నలుగురు ముష్కరులు హతం

12:08 February 24

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- నలుగురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్​ నిర్వహించాయి. జిల్లాలోని షాల్గుల్ అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా దళాలు వారిని మట్టుబెట్టాయి.

ఎన్​కౌంటర్ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలో అంతర్జాలంపై నిషేధం విధించారు. మరో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఎన్​కౌంటర్ ప్రాంతంలో చిక్కుకున్నారని సీఆర్​పీఎఫ్ వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 19న బడిగాం ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు లష్కరే తొయిబా అనుచరులను హతమార్చాయి భద్రతా దళాలు.

Last Updated :Feb 24, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.