ETV Bharat / bharat

ఖైదీని తీసుకెళ్తూ నలుగురు పోలీసులు.. శబరిమలకు వెళ్తూ ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Feb 15, 2022, 10:08 AM IST

Updated : Feb 15, 2022, 1:16 PM IST

accidents in india:: మంగళవారం పలు రాష్ట్రాల్లో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 16 మంది మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళూతూ ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్​లో జరిగిన ఘటనలో నలుగురు పోలీసులు సహా ఓ వ్యక్తి మరణించారు. మధ్యప్రదేశ్​లో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు.

భారీ వాహనాల మధ్య ఇరుక్కున్న కారు

Accidents in India: రాజస్థాన్​ జైపుర్​ జిల్లాలోని షాపురా ప్రాంతంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుజరాత్​కు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు పోలీసులు ఉన్నారు.

దిల్లీ నుంచి గుజరాత్​కు నిందితుడిని తరలిస్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

accident car
ప్రమాదానికి గురైన కారు

ముంబయి-పుణె ఎక్స్​ప్రెస్​ వేపై ప్రమాదం.. నలుగురు మృతి

ముంబయి- పుణె ఎక్స్​ప్రెస్​ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా, ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఖండలా ఘాట్​ సమీపంలో ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో రెండు భారీ కంటైనర్స్ సహా మెుత్తం ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వాహనాలన్నీ ముంబయి వైపుగా ప్రయాణిస్తున్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం, ఖోపోలి పోలీసులు హుటాహూటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు.

accident car
భారీ వాహనాల మధ్య ఇరుక్కున్న కారు
rescue team
క్షతగాత్రులను రక్షిస్తున్న రెస్క్యూ టీం

సింధ్​ నదిలోకి కార్మికుల వాహనం- నలుగురి దుర్మరణం

మధ్యప్రదేశ్​ శివపురి జిల్లాలో కార్మికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి సింధ్​ నదిలో పడిపోయింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వీరందరినీ బంగాల్​ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. జిల్లాలోని విర గ్రామంలో వంతెన నిర్మాణం కోసం వచ్చిన కూలీలని పోలీసులు తెలిపారు. జిల్లాలోని కొలరస్​ పోలీస్​ స్టేషన్​ పరిధి హిరపుర్​ గ్రామానికి సమీపంలో ఉదయం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

డ్రైవర్​ వాహనాన్ని అదుపు చేయలేకపోవడం వల్ల సింధ్​ నదిలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. వీరంతా సోమవారం రాత్రి రైలులో ఝాన్సీకి చేరుకున్నారని.. అక్కడి నుంచి పడొర గ్రామానికి బస్సులో వచ్చారని పోలీసులు చెప్పారు. వంతెన నిర్మాణమయ్యే ప్రదేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.

మృతిచెందిన వారిలో ముగ్గురిని హమీద్​ మహ్మద్​ అబ్దుల్లా, ఖాహుల్​ అమీన్​, హకీమ్​ ముస్తాఫాగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

అయ్యప్ప దర్శనానికి వెళుతూ..

కర్ణాటక నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ట్రక్కును ఢీ కొట్టింది. మంగళవారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

యాత్రికులు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్​ నిద్రలోకి జారిపోవడం వల్లే ట్రక్కును ఢీ కొట్టిందని ఎలాతుర్​ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్​ సహా మరో ఇద్దరు మృతిచెందారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇది చదవండి:'విజయం పక్కా మాదే- యోగికి ఇంటిదారి చూపిస్తాం'

Last Updated :Feb 15, 2022, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.