ETV Bharat / bharat

అనకాపల్లిలో కుటుంబం ఆత్మహత్యాయత్నం- నలుగురు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 7:38 AM IST

Updated : Dec 29, 2023, 8:03 AM IST

Family_Suicide_Attempt
Family_Suicide_Attempt

07:37 December 29

ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో చిన్నారి

Family Suicide Attempt: అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఆస్పత్రిలో చిన్నారి చికిత్సపొందుతోంది. అప్పుల బాధ తాళలేక వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం కొంతకాలంగా అనకాపల్లిలో నివసిస్తోంది. గురువారం రాత్రి వీరంతా సైనైడ్‌ తాగినట్లు తెలుస్తోంది. వీరిలో శివరామకృష్ణ(40), మాధవి (38), కుమార్తెలు వైష్ణవి(16), లక్ష్మి(13) మృతి చెందారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో మరో కుమార్తె కుసుమప్రియ(13) చికిత్స పొందుతోంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated :Dec 29, 2023, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.