ETV Bharat / bharat

భారీ అగ్ని ప్రమాదం- 18 గుడిసెలు దగ్ధం

author img

By

Published : Nov 20, 2021, 6:02 PM IST

త్రిపురలో భారీ అగ్ని (Fire accident latest news) ప్రమాదం జరిగింది. 18 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు వ్యాప్తి చెందకుండా మరో 11 గుడిసెలను ధ్వంసం చేశారు.

Agartala fire
అగ్ని ప్రమాదం

త్రిపురలో భారీ అగ్ని ప్రమాదం

త్రిపురలో భారీ అగ్ని ప్రమాదం (Fire accident latest news) సంభవించింది. ఉత్తర త్రిపుర జిల్లా పానీసాగర్​ పట్టణంలో 18 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు వ్యాప్తి చెందకుండా మరో 11 గుడిసెలను ధ్వంసం చేశారు.

Agartala fire
కాలి బూడిదైన గుడిసెలు

షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందు చర్యలు చేపట్టారు.

Agartala fire
మంటల్లో కాలిపోతున్న గుడిసెలు

భారత ప్రభుత్వం, మిజోరం, త్రిపుర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా త్రిపురలోని 11 ప్రదేశాల్లో వలసదారులకు పునరావాస కేంద్రాలు ఏర్పరిచారు. వాటిల్లో చాలా మంది ఇప్పటికీ నివసిస్తున్నారు.

ఇదీ చదవండి:బాంబు పేలుళ్లతో పట్టాలు తప్పిన రైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.