ETV Bharat / bharat

బాంబు పేలుళ్లతో పట్టాలు తప్పిన రైలు

author img

By

Published : Nov 20, 2021, 5:09 PM IST

Updated : Nov 20, 2021, 6:10 PM IST

Maoists attack in Jharkhand
రైల్వేట్రాక్​లపై బాంబు దాడి

ఝార్ఖండ్​లోని రైల్వేట్రాక్​లపై వరుస బాంబుదాడులకు(Maoists attack in Jharkhand) పాల్పడ్డారు దుండగులు. ధన్​బాద్​, లాతెహార్​, పశ్చిమ సింహబూమ్​ జిల్లాల్లో ట్రాక్​లను పేల్చివేశారు. మావోయిస్టులే ఈ దాడులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఝార్ఖండ్​లో శుక్రవారం అర్ధరాత్రి రైల్వే ట్రాక్​లపై(Maoists attack in Jharkhand) బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు దుండగులు.​ ధన్​బాద్​ జిల్లాలో రైల్వే ట్రాక్​ని పేల్చివేశారు. దీంతో అటుగా వస్తున్న రైలు పట్టాలు తప్పింది. లాతెహార్, పశ్చిమ సింహబూమ్​​ జిల్లాల్లోనూ రైల్వేట్రాక్​లపై బాంబుదాడులు జరిగాయి. దీంతో బార్​కాకానా- గర్హా, హవఢా- ముంబయి రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

Maoists attack in Jharkhand
పట్టాలు తప్పిన రైలు

మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్​ దా​ అరెస్టుపై శనివారం మావోయిస్టులు దేశవ్వాప్త బంద్​ ప్రకటించారు. ఈ క్రమంలో మావోయిస్టులే ఈ దాడులకు పాల్పడ్డారని (Naxalites blow up railway track) పోలీసులు తెలిపారు.

Maoists blow up Demu-Richughuta railway line
రైల్వే ట్రాక్​పై బాంబుదాడి
Maoists blow up Demu-Richughuta railway line
రైల్వేట్రాక్​పై బాంబుదాడి

ప్రస్తుతం ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్​ల మరమ్మతు పనులు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:'MSP డిమాండ్ నెరవేర్చితేనే రైతు ఉద్యమం ఆగుతుంది'

Last Updated :Nov 20, 2021, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.