రేప్​ వల్ల బాలికకు గర్భం.. దగ్గరుండి ప్రసవం చేసిన తండ్రి.. పసిబిడ్డ ఏడుస్తోందని గొంతు నులిమి..

author img

By

Published : Mar 8, 2023, 3:47 PM IST

Updated : Mar 8, 2023, 4:38 PM IST

Raped Minor Girl Baby Killed By Father

అత్యాచారానికి గురైన కన్నకూతురుకు పుట్టిన బిడ్డను పురిట్లోనే చంపేశాడు ఓ తండ్రి. శరీరం నుంచి తలను వేరు చేసి కాల్వలో పడేశాడు. చివరకు అరెస్టయ్యాడు. గుజరాత్​లో జరిగిందీ ఘటన.

అత్యాచారానికి గురైన బాలికకు పుట్టిన బిడ్డను అతి కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి. గుజరాత్ పఠాన్ జిల్లా​లో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. రేప్ కారణంగా గర్భం దాల్చిన​ కూతురికి స్వయంగా తండ్రే ప్రసవం చేసి.. పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేశాడు. అంతటితో ఆగకుండా కత్తితో శిశువు మొండెం నుంచి తలను వేరు చేసి కాలువలో పడేశాడు.
బాధిత బాలిక కొన్ని నెలల కిందట జిల్లాలోని ధేబెవాడి ప్రాంతంలో ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వల్ల అప్పటికే గర్భం దాల్చింది బాలిక. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఎనిమిదన్నర నెలల గర్భంతో ఉన్న బాలికకు నెలలు నిండకుండానే ఆమె తండ్రి ప్రసవం చేశాడు. అనంతరం పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేశాడు. అంతటితో ఆగకుండా శిశివు తలను కత్తితో నరికి దగ్గర్లోని కాలువలో పడేశాడు.

గర్భం ఏమైందమ్మా..?
అత్యాచారం కేసుకు సంబంధించి దర్యాప్తు సమయంలో బాలికను ఇటీవల వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. అప్పటి వరకు గర్భంతో ఉన్న బాలిక కడుపులో శిశువు పిండం లేదని గుర్తించారు వైద్యులు. ఈ ఘటనపై బాలికను లోతుగా విచారించగా తన తండ్రే తనకు ప్రసవం చేసి బిడ్డను గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులకు తెలిపింది. బాలిక చెప్పిన మాటలను విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

ప్రసవం చేసిన వెంటనే బిడ్డ ఏడుస్తుండటం వల్ల ఇరుగుపొరుగు వారికి విషయం తెలుస్తుందనే భయంతో పాప ముఖాన్ని గట్టిగా నొక్కిపట్టుకొని ఆపై గొంతు నులిమి చంపేసినట్లుగా బాలిక పోలీసులకు వివరించింది. అనంతరం కత్తితో శిశువు తలను మొండెం నుంచి వేరు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించకుండా బాధిత బాలిక తండ్రి జాగ్రత్త పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

బాధిత బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడైన తండ్రిపై కేసు నమోదు చేసుకున్న ధేబెవాడి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం శిశిువు తలను కాలువలో నుంచి స్వాధీనం చేసుకున్నారు . ఇప్పటికే బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ధేబెవాడి పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

6 ఏళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వృద్ధుడు..
మహారాష్ట్రలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో 55 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. రాష్ట్రంలోని బీడ్​ జిల్లాలోని ఓ గ్రామంలో మార్చి 3న వీధిలో తన స్నేహితులతో ఆడుకుంటున్న ఓ బాలికకు చాక్లెట్ ఆశ చూపి మాయమాటలు చెప్పాడు నిందితుడు. అనంతరం చిన్నారిని దగ్గర్లోని ఓ పాత భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే, జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రికి చెప్పడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద మార్చి 5న కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం బుధవారం అరెస్టు చేశారు.

Last Updated :Mar 8, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.