ETV Bharat / bharat

Farmers protest: 'జూన్ 5న సాగు చట్టాల ప్రతులు దగ్ధం'

author img

By

Published : Jun 3, 2021, 5:51 AM IST

Updated : Jun 3, 2021, 6:35 AM IST

Farmers to burn new Agri laws copies on June 5:
సాగు ప్రతులను దగ్ధం చేయనున్న రైతులు

జూన్​ 5న సాగు చట్టాల(Farmers protest) ప్రతులను దగ్ధం చేస్తామని భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ టికాయిత్​ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రూపొందించి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాలను(Farmers protest) రూపొందించి ఏడాది గడుస్తున్న సందర్భంగా.. జూన్​ 5న చట్టాల ప్రతులను మంటల్లో కాల్చివేస్తామని భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ టికాయిత్​ ప్రకటించారు. రైతుల డిమాండ్​లను ప్రభుత్వం అంగీకరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. ఉత్తర్​ప్రదేశ్​లోని రాం​పుర్​ వెళ్లిన టికాయిత్​.. బాబా అనూప్​ సింగ్​ ఆశీర్వాదాలు తీసుకున్నారు. రైతులలో(Farmers protest) స్ఫూర్తిని నింపడానికి ధర్నా చేశారు.

Farmers to burn new Agri laws copies on June 5:
బాబా అనూప్​ సింగ్ ఆశీర్వాదాలు తీసుకుంటున్న రాకేశ్ టికాయిత్

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్నాలు కొనసాగిస్తున్న ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక ఇళ్ల స్థానంలో కాంక్రీట్​ భవనాలను పునఃనిర్మిస్తామని రాకేశ్ టికాయిత్​ పేర్కొన్నారు.

Farmers to burn new Agri laws copies on June 5:
పోలీసులతో మాట్లాడుతున్న టికాయిత్​

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని శిక్షిస్తున్నారని ట్విట్టర్​లో టికాయిత్​ ఆరోపించారు. దేశంలో పాలకులను ఉద్దేశిస్తూ.. కిమ్​ జోంగ్​ ఉన్​లా తయారయ్యారని ఎద్దేవా చేశారు.

Farmers to burn new Agri laws copies on June 5:
రాం​పుర్​ వెళ్తున్న రాకేశ్​ టికాయిత్​

ఇదీ చదవండి: యూపీ భాజపాలో లుకలుకలు- యోగికి పార్టీ మద్దతు

నైరుతి రుతుపవనాలు రేపు రావడం ఖాయం!

Last Updated :Jun 3, 2021, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.