ETV Bharat / bharat

Electricity Bill Scam Message : ఆన్​లైన్​ కరెంట్​ బిల్లు స్కామ్ అంటే ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 1:54 PM IST

Eelectricity Bill Scam Message
Eelectricity Bill Scam Message

Electricity Bill Scam Message : ఈ మధ్య తరచుగా సైబర్​ నేరాలు గురించి వింటున్నాం. మోసపూరిత ఫోన్​కాల్స్, మెసేజ్​లకు స్పందించి ఎంతో మంది డబ్బును పోగొట్టుకుంటున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులు పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు ఎక్కువయ్యాయి. వారి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Electricity Bill Scam Message : ప్రస్తుత కాలంలో సాంకేతికతతో కలిగే లాభాలతో పాటు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గత కొన్నాళ్లుగా సైబర్ ​నేరగాళ్లు కరెంట్ బిల్లుల పేరుతో స్కామ్​లకు పాల్పడుతున్నారు. వారి బారిన పడితే మీ అకౌంట్​లో ఉన్న డబ్బును దోచేస్తారు. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా అందరినీ వారు బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్​ నేరగాళ్లు చేసే ఫోన్​కాల్స్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక వేళ వారి నుంచి ఫోన్ వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటి ఈ విద్యుత్​ బిల్లుల స్కామ్​?
ఇంటి కరెంట్​ బిల్లు వెంటనే చెల్లించాలని.. లేదంటే సరఫరాను నిలిపివేస్తామని సైబర్​ నేరగాళ్లు మెసేజ్​లు పంపుతుంటారు. అలాంటి వారి చేతిలో చాలా మంది మోసపోతున్నారు. దీనినే విద్యుత్ బిల్లుల స్కామ్​గా పిలుస్తున్నారు. ఏయే మార్గాల ద్వారా ఇటువంటి స్కామ్​లు జరుగుతున్నాయో తెలుసుకుందాం.

ఫోన్​కాల్స్​ ద్వారా..
ఈ మధ్య కాలంలో ఆన్​లైన్ కరెంట్ ​బిల్లుల మోసాలు ఎక్కువయ్యాయి. సైబర్ మోసగాళ్లు కరెంట్ బిల్లులు చెల్లించాలని కొంతమందికి ఫోన్ చేస్తుంటారు. కరెంట్ ఆఫీస్​ నుంచి కాల్​చేస్తున్నామని చెబుతుంటారు. మీ విద్యుత్​​ బిల్లు బకాయి ఉందని వెంటనే చెల్లించాలి.. లేదంటే కనెక్షన్ కట్​ చేస్తామని భయాందోళనలకు గురిచేస్తుంటారు. వెంటనే మీ ఫోన్​కు పంపిన లింక్​ ద్వారా చెల్లించండని మోసపూరితమైన వెబ్​సైట్​ లింక్​లను పంపుతుంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి నకిలీ లింక్​లపై క్లిక్ చేయొద్దు.

వాట్సాప్ మెసేజ్​, ఎస్​ఎంఎస్​లతో..
సైబర్​ నేరగాళ్ల ఆన్​లైన్ మోసాలకు ఈ మధ్య వాట్సాప్, ఎస్​ఎంఎస్​లను వేదికగా చేసుకుంటున్నారు. వారు మన ఫోన్​కు సందేశాలు పంపి అకౌంట్​లో డబ్బులను దోచేస్తున్నారు. " ప్రియమైన వినియోగదారులారా.. మీరు గత నెల చెల్లించిన విద్యుత్ బిల్లు అప్​డేట్ అవ్వలేదు. అందువల్ల బిల్లును వెంటనే చెల్లించండి. ఆలస్యమైతే మీ ఇంటికి విద్యుత్ సరఫరాను ఈరోజు రాత్రి 9.30 గంటలకు నిలిపివేస్తాం. మరిన్ని వివరాలకు వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడటానికి 82603XXXX42 నంబర్​కు సంప్రదించండి." ఇలాంటి మెసేజ్​ మీకు వాట్సాప్​లో వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నంబర్​లకు ఫోన్ ​చేయొద్దు.

మోసపూరిత లింక్​ల ద్వారా..
ఈ మధ్య ఫోన్​లకు మోసపూరిత లింక్​లను సైబర్​ నేరగాళ్లు పంపుతున్నారు. వాటినే ఫిషింగ్ అటాక్ అంటున్నారు. వారు పెట్టే లింక్​లు, మెసేజ్​లు అందరినీ నమ్మించేవిగా, మనల్ని కంగారు పెట్టేవిగా ఉంటాయి. వాటిపై క్లిక్ చేయడం వల్ల మన సమాచారం అంతా వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. సైబర్​ నేరగాళ్ల వలలో పడి చాలా మంది మోసపోతున్నారు.

అప్రమత్తతే.. అతిముఖ్యం
ఇప్పటి వరకు సైబర్ ​నేరగాళ్లు ఏవిధంగా మోసాలు చేస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు వారి బారిన పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్​లు పట్ల జాగ్రత్తగా ఉండండి.
  • సైబర్​ నేరగాళ్లు పంపే వెబ్​సైట్​ లింక్​లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.
  • ఒక వేళ మీకు కరెంట్​ బిల్​పై సందేహాలుంటే దానిపై ఉన్న ఫోన్​ నంబర్​కు సంప్రదించండి.
  • తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్​లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.
  • మీకు ఫోన్​కు వచ్చిన అనుమానితంగా మెసేజ్ పట్ల జాగ్రత్తలు వహించాలి.
  • సైబర్​ కేటుగాళ్లు మీకు ఫోన్​ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు కూడా అడిగే అవకాశం ఉంది.
  • మీ వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వవద్దు.
  • బ్యాంక్​ అకౌంట్ వివరాలు, మీ చిరునామా వివరాలు అపరిచితులకు పంపవద్దు.

Cyber Cheatings in Patancheru : సైబర్​ నేరగాళ్ల నయా రూట్​.. ఫుడ్​ ఆర్డర్​ క్యాన్సిల్​ చేసినందుకు ఖాతా ఖాళీ

Thane Cyber Fraud : భారీ సైబర్ మోసం.. పేమెంట్ గేట్​వే హ్యాక్.. రూ.16 వేల కోట్లు స్వాహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.