గుట్టలుగా నోట్ల కట్టలు.. మంత్రి అరెస్ట్​.. రూ. 20 కోట్లు స్వాధీనం

author img

By

Published : Jul 23, 2022, 4:25 AM IST

Updated : Jul 24, 2022, 6:57 AM IST

ED seized 20 crores

Arpita Mukherjee TMC: బంగాల్‌లో మంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ నేత పార్థా చటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఏకంగా రూ.20 కోట్ల నోట్ల కట్టలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో అవకతవకలకు సంబంధించిన కేసులో సోదాలకు వెళ్లిన అధికారులకు ఈ డబ్బు దొరికింది. దర్యాప్తులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అనంతరం.. మంత్రి పార్థా చటర్జీని ఈడీ అరెస్టు చేసింది.

Arpita Mukherjee TMC: బంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో శనివారం ఒక్కరోజే దర్యాప్తు సంస్థ అధికారులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కావడం గమనార్హం. ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య కూడా అరెస్టయ్యారు. పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి శుక్రవారం జరిపిన సోదాల్లో అర్పితా ముఖర్జీ నివాసంలో లభించిన నగదు రూ.21 కోట్లుగా ఈడీ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి 26 గంటల పాటు ఛటర్జీని ఆయన నివాసంలో ప్రశ్నించిన అధికారులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఆ తర్వాత తన ఆరోగ్యం సరిగా లేదని ఛటర్జీ తెలపడంతో ఆయనను శనివారం సాయంత్రం ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ED seized 20 crores
ఈడీ సీజ్​ చేసిన డబ్బు

ఛటర్జీ అరెస్టుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందించింది. మంత్రిని కోర్టు దోషిగా ప్రకటిస్తే ఆయనపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మంత్రి అరెస్టుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రకటన చేయాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ డిమాండ్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అవినీతిలో కూరుకుపోయిందని మంత్రి అరెస్టు నిరూపించిందని ధ్వజమెత్తారు.

మోనాలిసా దాస్‌పైనా ఈడీ నిఘా!

మంత్రి పార్థా ఛటర్జీకి సన్నిహితురాలైన మోనాలిసా దాస్‌పై కూడా ఈడీ నిఘా ఉంచిందని తెలుస్తోంది. అసన్‌సోల్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఆమె ప్రొఫెసర్‌. బంగ్లాదేశ్‌ నేపథ్యం ఉన్న మోనాలిసా దాస్‌ పేరుపై 10 ఫ్లాట్లు రిజిస్టరై ఉన్నాయని భాజపా నేత దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు.

ed-seized-20-crores-search-operations-at-arpita-mukharjee-house
పార్థా ఛటర్జీ

ఎవరీ అర్పితా ముఖర్జీ..?
పార్థా ఛటర్జీకి సన్నిహితురాలుగా భావిస్తున్న అర్పితా ముఖర్జీ సినీనటి, మోడల్‌. ఆమె బెంగాలీ, ఒరియా, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఛటర్జీకి చెందిన, కోల్‌కతాలోనే పెద్దదైన దుర్గ పూజా కమిటీలో 2019, 2020లలో ఆమె చురుగ్గా వ్యవహరించారు. ఆ సమయంలో అర్పితకు ఛటర్జీతో పరిచయం ఏర్పడింది. ఈడీ తనిఖీల విషయం తెలిసిన వెంటనే దుర్గామాత పూజలో ఆమె, పార్థా ఛటర్జీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి పాల్గొన్న పాత చిత్రాన్ని భాజపా నేత సువేందు అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. పార్థా చటర్జీ అరెస్టు తర్వాత అర్పితనూ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె తన వద్ద రూ.21 కోట్ల నగదు ఎందుకు ఉందో సరైన వివరణ ఇవ్వలేదని ఈడీ తెలిపింది. కుంభకోణంతో ప్రమేయం ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది. అంతకుముందు అర్పితా ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ.. తన నివాసంలో నగదు పట్టుబడటం భాజపా కుట్రగా ఆరోపించారు.

ed-seized-20-crores-search-operations-at-arpita-mukharjee-house
పార్థా ఛటర్జీతో అర్పితా ముఖర్జీ

ఇవీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన రాజకీయ దిగ్గజం.. ఇక కుమారుడి ఇన్నింగ్స్​!

నీరవ్ మోదీకి షాకిచ్చిన ఈడీ! రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు

Last Updated :Jul 24, 2022, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.