ETV Bharat / bharat

సెర్లాక్ ప్యాకెట్లలో డ్రగ్స్- ఉగాండా మహిళ అరెస్ట్

author img

By

Published : Jan 8, 2022, 8:11 PM IST

drugs
డ్రగ్స్

Drugs Karnataka: కర్ణాటక హుబ్లీ రైల్వేస్టేషన్​లో 995 గ్రాముల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు ఎన్​సీబీ అధికారులు. ఈ డ్రగ్స్​ తీసుకువచ్చిన ఉగాండా మహిళను అదుపులోకి తీసుకున్నారు.

సెర్లాక్ ప్యాకెట్లలో డ్రగ్స్

Drugs Karnataka: కర్ణాటక హుబ్లీ రైల్వేస్టేషన్‌లో దాదాపు కిలో పరిమాణంలో ఉన్న ప్రమాదకర డ్రగ్స్‌ను నార్కోటిక్స్​ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఉగాండకు చెందిన మహిళ నుంచి ఈ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Methamphetamine
అధికారులు సీజ్ చేసిన డ్రగ్స్
Methamphetamine
సెర్లాక్ ప్యాకెట్లలో డ్రగ్స్

నిందితురాలు దిల్లీ నుంచి ఈ డ్రగ్స్​ తీసుకువచ్చిందని అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపిల్లలకు ఆహారంగా అందించే సెర్లాక్ ప్యాకెట్లలో డ్రగ్స్​ తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన డ్రగ్​ అత్యంత ప్రమాదకరమైందని అధికారులు వివరించారు. దీర్ఘకాలంలో నాడీవ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి దుష్ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు.

drugs
డ్రగ్స్
drugs
డ్రగ్స్​ తీసుకొచ్చిన ఉగాండా మహిళ అరెస్టు

ఇదీ చదవండి:

పొలంలో ఉన్నట్లుండి హెలికాప్టర్​ ప్రత్యక్షం.. అవాక్కైన జనం

భారీగా మంచు కురుస్తున్నా.. గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన సైనికులు

నైస్​రోడ్డులో కారు- ట్రక్కు ఢీ- నలుగురు టెకీలు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.