ETV Bharat / bharat

నైస్​రోడ్డులో కారు- ట్రక్కు ఢీ- నలుగురు టెకీలు దుర్మరణం

author img

By

Published : Jan 8, 2022, 7:29 PM IST

accident
రోడ్డు ప్రమాదం

Bangalore Accident: కర్ణాటక బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. రెండు కార్లు, మూడు కంటైనర్​ వాహనాలు ధ్వంసమయ్యాయి.

బెంగళూరు రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

Bangalore Accident: కర్ణాటక బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు సాఫ్ట్​వేర్ ఉద్యోగులు మృతిచెందారు. ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అతివేగమే కారణం..

నైస్​రోడ్డు ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు శుక్రవారం రాత్రి కారును ఢీకొట్టింది. అయితే.. కేరళకు చెందిన ఈ కారులో నలుగురు టెకీలు ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు తమిళనాడు నుంచి వచ్చినట్లు గుర్తించారు.

bengalore accident
ధ్వంసమైన కారు
accident
నలుగురు టెకీలు దుర్మరణం

ఈ ఘటనలో మరో రెండు కార్లు, నాలుగు కంటైనర్​ వాహనాలు కూడా ధ్వంసమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం దాదాపు 8 కిలోమీటర్ల మేరకు వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయినట్లు వెల్లడించారు.

bengalore accident
ఘోర రోడ్డు ప్రమాదం

ఇదీ చదవండి:

లాక్​డౌన్​లో రోజుకు 20గంటలు కష్టపడి.. 145 సర్టిఫికెట్లు సాధించి..

ఆటో ఛార్జీ ఇవ్వలేదని.. బాలికపై డ్రైవర్​ అత్యాచారం

బాలికపై ఆలయ పూజారి అత్యాచారం- జాతకం కోసం వెళ్తే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.