ETV Bharat / bharat

'పానీపూరీ' కోసం గొడవ- భార్య ఆత్మహత్య!

author img

By

Published : Sep 1, 2021, 6:27 PM IST

panipuri suicide
పానీపూరీ తెచ్చినందుకు భార్య ఆత్మహత్య!

పానీపూరీ (pani puri) కారణంగా భర్తతో జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. మహారాష్ట్ర పుణెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ పానీపూరీ.. భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. అంతేకాదు, ఆ గొడవ తారస్థాయికి చేరుకుని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.

పుణెలో నివసిస్తున్న గహినీనాథ్​ సర్వాడే ఇటీవల గ్రామంలో నివసిస్తున్న భార్య ప్రతీక్ష(23)ను పుణె తీసుకువచ్చాడు. కొద్ది రోజుల క్రితం గహినీనాథ్​.. ఇంటికి పానీపూరీ (pani puri) తీసుకెళ్లాడు. తనను అడగకుండా పానీపూరీ ఎందుకు తెచ్చావ్​ అంటూ భార్య.. అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ విషయంపైనే వారు రెండు రోజుల పాటు గొడవ పడ్డారు. శనివారం రోజు.. ప్రతీక్ష, ఆవేశంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త గహినీనాథ్​ సర్వాడేను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి : నాలుగేళ్ల బాలికపై అత్యాచారం- నిందితుడ్ని చితకబాదిన బంధువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.