ETV Bharat / bharat

జల దిగ్బంధంలో దిల్లీ! మళ్లీ డేంజర్ మార్క్​ దాటిన యమునా నది.. ఆ రైళ్లు రద్దు

author img

By

Published : Jul 24, 2023, 3:45 PM IST

Updated : Jul 24, 2023, 5:48 PM IST

Delhi Yamuna Water Level Today
Delhi Yamuna Water Level Today

Delhi Yamuna Water Level Today : ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో దిల్లీలో యుమునా నది మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల యమునకు భారీగా వరద వస్తోంది.

Delhi Yamuna Water Level Today : ఎగువనుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దిల్లీలో యమునమ్మ మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది.. 206.42 మీటర్ల ఎత్తులో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. యమునా ఉద్ధృతితో రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దిల్లీ -షాహదారా మధ్య రాకపోకలు నిలిపేశామని, రైళ్లు న్యూదిల్లీ మీదుగా మళ్లించామని వివరించారు.

Yamuna Water Level In Delhi : యమునా నది నీటిమట్టం పెరగుతుండడం వల్ల.. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభావం పడుతోందని దిల్లీ సర్కార్‌ తెలిపింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు యమునా నది నీటిమట్టం 206.54 మీటర్లకు పెరిగిందని కేంద్ర జల కమిషన్ (CWC) వెల్లడించింది. సోమవారం సాయంత్రానికల్లా యమునా నది నీటి ఉద్ధృతి తగ్గే అవాకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జులై 25 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలతో దిల్లీ వణికిపోతోంది. హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి భారీగా వరద పోటెత్తితే దేశ రాజధాని మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకోవడం ఖాయమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా దిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 208.05 మీటర్లకు చేరింది.

Yamuna River Danger Mark : ఇటీవల దేశ రాజధాని దిల్లీని యమునా నది వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలతో పాటు రాజ్‌ఘాట్‌ నుంచి దిల్లీ సచివాలయం వరకు ఉన్న ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, మంత్రుల కార్యాలయాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు.. కాలువలను తలపించాయి. మోకాళ్లు లోతుకుపైగా వరదనీరు నిలిచిపోయింది. యమునా నదిలో నీటి ప్రవాహం గంటగంటకూ తీవ్రరూపం దాలుస్తుండటం వల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. హరియాణాలోని హత్నికుంద్‌ బ్యారేజ్‌ నుంచి తక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను అభ్యర్థించారు. నది సమీపంలోని రోడ్లు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు కాపాడడం చాలా మఖ్యమని.. అందుకోసం ప్రజలు సహకరించాలని సీఎం కోరారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :Jul 24, 2023, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.