ETV Bharat / bharat

దిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ, పంజాబ్​లో ఆంక్షలు.. మళ్లీ లాక్​డౌన్​ తప్పదా?

author img

By

Published : Jan 4, 2022, 1:53 PM IST

Updated : Jan 4, 2022, 2:27 PM IST

Delhi weekend curfew: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ ఉద్ధృతితో చాలా రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైరస్​ను కట్టడి చేసేందుకు వీకెండ్​ కర్ఫ్యూ విధించింది దిల్లీ ప్రభుత్వం. పంజాబ్​​ కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. రోజువారీ కేసులు 20వేలు దాటితే లాక్​డౌన్ తప్పదని ముంబయి మేయర్ స్పష్టం చేశారు.

Delhi weekend curfew
దిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ

Delhi weekend curfew: ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో దావానలంలా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి జారుకుంటున్నాయి.

వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా ప్రకటించారు. బస్సులు, మెట్రోలో 50శాతం సామర్థ్యం ఉండటం వల్ల రద్ధీ బాగా పెరిగిందని, అందుకే సీటింగ్ సామర్థ్యాన్ని తిరిగి 100శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. మాస్క్ ధరించిన వారికే ప్రవేశమని స్పష్టం చేశారు. ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో పని చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటి సిఫారసుకు అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు మనీశ్.

Delhi weekend curfew
దిల్లీ మెట్రో ఎక్కేందుకు తిప్పలు..
Delhi weekend curfew
మెట్రో కోసం ఇలా..
Delhi weekend curfew
దిల్లీలోని ఓ మెట్రో స్టేషన్​ పరిసరాల్లో రద్దీ..

Punjab night curfew

వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో పంబాబ్​ ప్రభుత్వం అప్రమత్తమైంది. పురపాలక ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బార్లు, సినిమా హాళ్లు, మాల్స్​, రెస్టారెంట్లు, స్పాలు 50 శాతం సామర్థ్యంతోనే నడవాలని ఆదేశించింది. జిమ్​లను పూర్తిగా మూసివేసింది. టీకా రెండు డోసులు తీసుకుంటేనే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విధులకు హాజరుకావాలని సూచించింది.

Mumbai lockdown news

ముంబయిలో రోజువారీ కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ నగరంలో రోజువారీ కేసులు 20వేలు దాటితే లాక్​డౌన్ విధించక తప్పదని ముంబయి మేయర్​ కిశోరి పెడ్నేకర్ స్పష్టం చేశారు.

Delhi weekend curfew
కొవిడ్​ నిబంధనలతో మూతపడ్డ పాఠశాల
Delhi weekend curfew
కొవిడ్​ నిబంధనలతో మూతపడ్డ పాఠశాల

Karnataka semi lockdown

కర్ణాటకలో కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో నిపుణులతో సమావేశం నిర్వహించారు సీఎం బసవరాజ్​ బొమ్మై. అయితే లాక్​డౌన్ విధించే అవకాశాలకు కొట్టిపారేశారు. అవసరమైతే లాక్​డౌన్​ తరహా ఆంక్షలు అమలు చేస్తాం గానీ, పూర్తి స్థాయి లాక్​డౌన్ ఉండబోదని చెప్పారు. కేరళ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆ ఆసుపత్రిలో మరో 72 మంది వైద్యులకు కరోనా

Last Updated : Jan 4, 2022, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.