ETV Bharat / bharat

జవాన్ల అత్యవసర వైద్యానికి 'రక్షిత' సేవలు ప్రారంభం

author img

By

Published : Jan 18, 2021, 11:31 AM IST

CRPF and DRDO launched specially developed RAKSHITA
జవాన్ల అత్యవసర వైద్యం కోసం వచ్చేసిన 'రక్షిత'

సైనికులకు అత్యవసర వైద్యం అందించే ఉద్దేశంతో రూపొందించిన బైక్​ అంబులెన్స్​లు దిల్లీలో అందుబాటులోకి వచ్చాయి. సీఆర్​పీఎఫ్​, డీఆర్​డీఓ సంయుక్తంగా సోమవారం వీటిని ప్రారంభించాయి. వాటికి 'రక్షిత' అని నామకరణం చేశారు.

జవాన్ల అత్యవసర వైద్యం కోసం రూపొందించిన బైక్​ అంబులెన్స్​లు దిల్లీలో సోమవారం అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్​డీఓ)లు వీటిని సోమవారం లాంఛనంగా ప్రారంభించాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, ఇరుకైనదారుల్లో సులువుగా చేరుకునేలా 'రక్షిత' పేరుతో ఈ బైక్ అంబులెన్స్​ను రూపొందించారు.

bike ambulance for jawans
బైక్​ అంబులెన్స్​లు
bike ambulance for jawans
'రక్షిత' బైక్​ అంబులెన్స్​లో ఏర్పాట్లు
bike ambulance for jawans
'రక్షిత' బైక్​ అంబులెన్స్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లీడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఆర్‌డీఓ సంస్థలు సంయుక్తంగా ఈ బైక్​ అంబులెన్స్​లను అభివృద్ధి చేశాయి. అడవుల్లో సమయానికి వైద్యం అందక సామాన్య ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండే లక్ష్యంతో వీటిని రూపొందించామని తెలిపాయి తయారీ సంస్థలు.

ఇదీ చూడండి:'కరోనా సమయంలో నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.