ETV Bharat / bharat

'నాకు ఇండియానే నచ్చింది'.. పోలీసులకు కృతజ్ఞతలు: బధిర యువతి గీత

author img

By

Published : Jul 9, 2022, 4:22 PM IST

deaf-mute-geeta-thanks-grp-police-in-bhopal
deaf-mute-geeta-thanks-grp-police-in-bhopal

భారత్​తో తప్పిపోయి పాక్​కు వెళ్లి.. అప్పటి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్​ చొరవతో తిరిగి స్వదేశానికి చేరుకున్న మధ్యప్రదేశ్​కు చెందిన బధిర యువతి గీత ఎట్టకేలకు తన తల్లి దగ్గర ఆనందంగా జీవిస్తోంది. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులతో భోపాల్ జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చింది. ఎంతో చురుగ్గా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సైగల ద్వారా సమాధానాలిచ్చింది.

Deaf Girl Geetha Thanks Police: గీత గుర్తుందా?.. మన దేశంలో తప్పిపోయి పాకిస్థాన్ చేరుకుని సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన బధిర యువతి. 2015లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో.. తిరిగి ఆమె భారత్​కు చేరుకుంది. గీతను స్వదేశానికి రప్పించడానికి విశేష కృషి చేసి, తల్లిదండ్రుల ఒడికి చేర్చి ఆమెకు మరో బతుకునిచ్చారు సుష్మా స్వరాజ్. తాజాగా ఆమె తన కుటుంబ సభ్యులతో మధ్యప్రదేశ్​ భోపాల్​ జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు​ వచ్చింది. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన గీత.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సైగల ద్వారా సమాధానమిచ్చింది. పోలీసులు గీతను.. పాకిస్థాన్​ నచ్చిందా? ఇండియా నచ్చిందా? అక్కడ వారు ఎలా చూసుకున్నారు? శాకాహారం పెట్టారా? వారితో ఇంకా టచ్​లో ఉన్నావా? వంటి ప్రశ్నలు అడిగారు. వాటన్నంటికి ఎంతో చక్కగా గీత సైగల ద్వారా సమాధానాలు ఇచ్చింది.

"నేను భారత్​ను ఇష్టపడుతున్నాను. పాకిస్థాన్​లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. అక్కడ ప్రజలు ఎక్కువగా మాంసాహరం తింటారు. కానీ నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ నాన్​వెజ్​ తినొద్దని చెప్పిన విషయం గుర్తుంది. అది వారికి చెప్పినందున వారు నాకు శాకాహారం పెట్టేవారు. పాక్​ నుంచి వచ్చాక కొన్నాళ్లు వారితో టచ్​లో ఉన్నాను."

-- గీత, బధిర యువతి(సైగలు ద్వారా)

ఎవరీ గీత?
బధిర యువతి గీత అసలు పేరు రాధ. 20 సంవత్సరాల క్రితం తప్పిపోయి పాకిస్థాన్​కు చేరుకుంది గీత. అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసింది. 15 సంవత్సరాలు పాకిస్థాన్​లోని లాహోర్​లో ఉన్న ఆమె కట్టు, బొట్టు, ఆహార అలవాట్లు చూసి అక్కడున్న నిర్వాహకులు గీత అని పేరు పెట్టారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో గీత ఫొటో చక్కర్లు కొట్టింది. దీంతో నాటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ చొరవ తీసుకొని 5 సంవత్సరాల క్రితం ఆమెను భారత్​కు తీసుకువచ్చారు. అనంతరం మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత ఆమె సైగలను అర్థం చేసుకుని తెలంగాణలోని బాసరకు తీసుకొచ్చారు. ఆ సమయంలోనే నలభై కుటుంబాలు.. తమ కుమార్తె అంటే తమ కుమార్తె అని ఎగబడ్డారు. కానీ అధికారులు ఎవరికీ అప్పగించలేదు. అనంతరం గీత అమ్మమ్మ తెలిపిన గుర్తులను నిర్ధరించుకున్న అధికారులు.. గతేడాది గీతను తన తల్లి చెంతకు చేర్చారు.

ఇవీ చదవండి: 'నేను దుర్గాదేవిని.. నా భర్తను వదలండి'.. మహిళ హైడ్రామా.. పోలీస్ స్టేషన్​లో చేతబడి!

ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం... అసలు ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.