ETV Bharat / bharat

రాత్రి కర్ఫ్యూ పర్యవేక్షణకు.. వీధుల్లో తిరిగిన సీఎం

author img

By

Published : May 9, 2021, 8:16 AM IST

tripura cm
కర్ఫ్యూ అమలును స్వయంగా పర్యవేక్షించిన సీఎం

అగర్తలాలో కర్ఫ్యూ నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం బిప్లవ్ కుమార్​ దేవ్​ స్థానిక వీధుల్లో తిరిగారు. అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తోంది త్రిపుర ప్రభుత్వం. ఆ రాష్ట్ర రాజధాని అగర్తలాలో కర్ఫ్యూ నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం బిప్లవ్ కుమార్​ దేవ్​ స్థానిక వీధుల్లో తిరిగారు. ఈ సమయంలో ఆయన వెంట అధికారులూ ఉన్నారు. స్థానికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం.. సిబ్బందితో పాటు వైద్యాధికారులుతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి.. ఇప్పటికే రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కొవిడ్​ పరిస్థితిపై సమీక్షించారు. మొదటి నుంచి కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా ముందుడి పోరాడుతున్నారు బిప్లవ్​.

కర్ఫ్యూ అమలును స్వయంగా పర్యవేక్షించిన సీఎం

ఈ నేపథ్యంలో మీడియోతో మాట్లాడారు త్రిపుర సీఎం. కరోనా చికిత్సను జిల్లా స్థాయికి, సబ్ డివిజన్​ స్థాయి వరకూ తీసుకువెళ్లినట్లు తెలిపారు. కొవిడ్​ రోగులకు వారి సొంత జిల్లాలోనే వైద్యసదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా మొదటి దశలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు చేయించుకున్నారని.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. ఇది రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల మెరుగుదలను నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జనాభా కట్టడిపై పిల్​లో కక్షిదారుగా ఆరోగ్య శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.