ETV Bharat / bharat

భారత్​లో మళ్లీ కరోనా విజృంభణ, ఒక్కరోజే 15 వేలకుపైగా

author img

By

Published : Aug 19, 2022, 9:48 AM IST

Covid Cases in India Today
Covid Cases in India Today

Covid Cases in India భారత్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజే 15,754 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 47 మంది చనిపోయారు.

Covid Cases in India: దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల వరకు 15,754 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 47 మంది కరోనాతో మరణించగా.. 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.58 శాతం వద్ద స్థిరంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.23 శాతం, డైలీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉంది.

  • మొత్తం కేసులు: 4,43,14,618
  • క్రియాశీల కేసులు: 1,01,830
  • మొత్తం మరణాలు: 5,27,253
  • కోలుకున్నవారు: 4,36,85,535

Vaccination India: భారత్​లో గురువారం 31,52,882 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,09,27,32,604కు చేరింది. ఒక్కరోజే 4,54,491 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
ఇవీ చదవండి: మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా

కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.