ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరో 1.72 లక్షల మందికి వైరస్​

author img

By

Published : Feb 3, 2022, 9:23 AM IST

india cases
కరోనా కేసులు

COVID CASES IN INDIA: భారత్​లో కరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మరో 1.72లక్షల మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1008 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Covid cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,008 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,59,107 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం మరణాలు: 4,98,983
  • యాక్టివ్ కేసులు: 15,33,921

దేశంలో ఇప్పటి వరకు మొత్తం 167.87కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 30,17,855 మందికి కరోనా సోకింది. 11,921 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 385,204,312కి చేరగా.. మరణాల సంఖ్య 57,18,791కి పెరిగింది.

  • ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 3,1,5,363 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 276 మంది చనిపోయారు.
  • US Corona Cases: అమెరికాలో కొత్తగా 302,177 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,990 మంది మరణించారు.
  • ఇటలీలో 1,18,994 లక్షల కొత్త కేసులు బయటపడగా.. 395 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,88,552 మందికి వైరస్​ సోకగా.. 946 మంది చనిపోయారు.
  • జర్మనీలో ఒక్కరోజే దాదాపు 2,23,322 మందికి వైరస్ సోకింది. మరో 174 మంది మృతి చెందారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.