ETV Bharat / bharat

కేరళలో కొత్తగా 52వేలకుపైగా కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

author img

By

Published : Feb 2, 2022, 7:17 PM IST

Updated : Feb 2, 2022, 10:43 PM IST

Covid Cases in India: కేరళలో కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 52199 మందికి పాజిటివ్​ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 61,29,755కు చేరింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా భారీగా కేసులు బయటపడ్డాయి.

covid cases in kerala
కేరళలో కరోనా కేసులు

Covid Cases in India: కరోనా హాట్​స్పాట్​గా మారిన కేరళలో కొత్తగా 52వేలకుగా కేసులు వెలుగుచూశాయి. కొత్తగా 52,199 మందికి వైరస్​ సోకగా.. 500 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా తగ్గింది. కొవిడ్​తో చనిపోయిన వారి సంఖ్య మంగళవారం 1,205గా నమోదైంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 56,100కు చేరింది.

వైరస్​ నుంచి మరో 41,715 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,95,091కు చేరింది. మరోవైపు ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో నమోదైన కొవిడ్​ కేసుల సంఖ్య 61,29,755. వీటిలో 3,77,823 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

  • దిల్లీలో కొత్తగా 3,028 కేసులు నమోదుకాగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంకొత్త కేసులుమరణాలు
కర్ణాటక20,50581
తమిళనాడు19,28020
మహారాష్ట్ర18,06779
గుజరాత్8,93434
రాజస్థాన్8,42822
మధ్యప్రదేశ్​7,3596
ఆంధ్రప్రదేశ్5,98311
హరియాణా3,26717
తెలంగాణ2,6463

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి : 'టీకా వల్లే నా కూతురు మృతి.. వాళ్లు రూ.1000కోట్లు చెల్లించాలి'

Last Updated : Feb 2, 2022, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.