ETV Bharat / bharat

Covid: మహారాష్ట్రలో దశలవారీగా 'అన్​లాక్'

author img

By

Published : Jun 3, 2021, 11:18 PM IST

మహారాష్ట్రలో దశలవారీగా లాక్​డౌన్​ను సడలించాలని ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉన్నందున రాష్ట్రంలోని జిల్లాలను ఐదు విభాగాలుగా వర్గీకరించి ఆంక్షలను అమలు చేయనుంది. ఇక కర్ణాటకలో జూన్ 14వరకు లాక్​డౌన్​ను కొనసాగించాలని అక్కడి సర్కారు నిర్ణయించింది. మరోవైపు.. టీకా వేసుకున్న వారినే రెస్టారెంట్లలో పనికి అనుమతించనున్నట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

restrictions
కరోనా తగ్గుతున్నా.. ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు?

మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఐదు అంచెలుగా లాక్‌డౌన్ సడలింపులను అమలు చేయాలని.. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న ఆంక్షలు జూన్‌ 15వరకు కొనసాగుతున్నప్పటికీ.. ఆ తర్వాత ఆంక్షల సడలించే వ్యూహాన్ని ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది. కొవిడ్‌ తీవ్రతను బట్టి రాష్ట్రంలోని జిల్లాలను ఐదు స్థాయులుగా వర్గీకరించిన ప్రభుత్వం.. వాటికి అనుగుణంగా ఆంక్షలను సడలిస్తామని తెలిపింది.

లెవెల్‌-1లో ఉన్న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తివేయనున్నారు. వైరస్‌ తీవ్రత అదుపులో ఉన్న లెవెల్‌-2 జిల్లాల్లో మాత్రం నలుగురు వ్యక్తుల కంటే ఎక్కువగా గుమిగూడకుండా సెక్షన్‌ 144ను అమలు చేస్తారు.

కర్ణాటకలో లాక్​డౌన్​ పొడగింపు..

రాష్ట్రంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్టున్నట్టు సీఎం యడియూరప్ప ప్రకటించారు. ప్రస్తుతం కొనసాతున్న లాక్‌డౌన్‌ ఆంక్షలు ఈ నెల 14 ఉదయం 6గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం పలువురు మంత్రులు, సీనియర్‌ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్టు గురువారం సాయంత్రం ప్రకటించారు.

ఇదీ చదవండి: బతుకు భారమై.. మెతుకు కరవై ఆటోకు నిప్పు!

ఇదీ చదవండి: కరోనాకు 'మందు'గా పవిత్రజలం- ఎగబడ్డ జనం

టీకా పొందినవారికే రెస్టారెంట్‌లో పని!

లాక్‌డౌన్‌ వేళ రెస్టారెంట్లను సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్నారు. 'రెస్టారెంట్లో సిబ్బంది అంతా కచ్చితంగా వ్యాక్సిన్‌ వేయించుకుని కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. హోటల్స్‌ మూసివేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. కష్టకాలంలోనూ వ్యాపారాలు పుంజుకోవాలి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోటల్‌ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మినహాయింపులు ఇస్తున్నాం. కరోనా వ్యాప్తిని నియంత్రిస్తూ.. ఇంకోవేవ్‌ రాకుండా జాగ్రత్తపడాలి. అందుకే ఫుడ్‌ డెలివరీ మీద దృష్టి పెట్టాం' అని అన్నారు.

ఇవీ చదవండి:

బతుకు భారమై.. మెతుకు కరవై ఆటోకు నిప్పు!

కరోనాకు 'మందు'గా పవిత్రజలం- ఎగబడ్డ జనం

సడలింపు సమయంలో కిటకిట.. లాక్​డౌన్​లో స్తబ్ధత

Unlock: 'క్రమంగా లాక్​డౌన్​ ఎత్తివేత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.