ETV Bharat / bharat

Covid-19: దేశంలో మళ్లీ 4వేల కరోనా మరణాలు

author img

By

Published : Jun 12, 2021, 9:37 AM IST

Updated : Jun 12, 2021, 11:01 AM IST

దేశంలో కరోనా మరణాల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించటం లేదు. దేశవ్యాప్తంగా కొత్తగా 4,002 మంది కొవిడ్​ బారినపడి మరణించారు. మరో 84,332 కేసులు నమోదయ్యాయి.

india cases
ఇండియా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో(Covid in India) తగ్గుదల కనిపించినా.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా కొత్తగా 4,002 మంది కొవిడ్(Corona deaths)​ బారినపడి మరణించారు. తాజాగా మరో 84,332 కేసులు వెలుగులోకి వచ్చాయి. 70 రోజుల తర్యాత ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

  • మొత్తం కేసులు: 2,93,59,155
  • యాక్టివ్ కేసులు: 10,80,690
  • కోలుకున్నవారు: 2,79,11,384
  • మొత్తం మరణాలు: 3,67,081

కరోనా సోకిన వారిలో మరో 1,21,311 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రికవరీ రేటు 95.07 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.24 శాతానికి తగ్గింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొత్తగా 20,44,131 టెస్టులు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 37,42,42,384 కి చేరింది.

ఇదీ చదవండి:కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం!

'తగ్గిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు'

Last Updated : Jun 12, 2021, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.