ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతంగా కరోనా- 50లక్షల టీకాల ఎక్స్​పైరీపై కేంద్రం క్లారిటీ

author img

By

Published : Feb 3, 2022, 5:55 PM IST

Corona Cases In India: దేశంలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేరళ, మిజోరాంలో మాత్రం వైరస్ ప్రభావం ఇంకా పెరుగుతోందని స్పష్టం చేసింది.

Corona Cases In India
కరోనా

Corona Cases In India: దేశంలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోనూ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతోందని వెల్లడించింది. కేరళ, మిజోరాంలో మాత్రం వైరస్​ ప్రభావం ఇంకా పెరుగుతోందని స్పష్టం చేసింది. దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది.

కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మూడో దశలో సరాసరి 44 ఏళ్ల వయసుగలవారు అత్యధికంగా వ్యాధిబారిన పడ్డారని వెల్లడించింది. గత కరోనా వేవ్​లతో పోలిస్తే.. మందుల వాడకం బాగా తగ్గిందని తెలిపింది. 11 రాష్ట్రాల్లో పాఠశాలలు పూర్తిగా ప్రారంభమయ్యాయని పేర్కొంది. 16 రాష్ట్రాలు విద్యాసంస్థలను​ పాక్షికంగా తెరిచి ఉంచగా.. 9 రాష్ట్రాల్లో పూర్తిగా మూసివేశారని వెల్లడించింది.

తప్పుదోవ పట్టించేవి..

మరోవైపు.. ఈ నెల చివరివరకు 50 లక్షల కరోనా టీకా డోసులు వృథా కాబోతున్నాయనే వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. అవన్నీ అసత్యాలు, తప్పుదోవ పట్టించే కథనాలని పేర్కొంది. ఏ వ్యాక్సిన్​ల చివరి తేదీలు ముగియలేదని స్పష్టం చేసింది. కరోనా టీకా డోసుల లభ్యతను సమీక్షించాలని రాష్ట్రాలను కోరింది. తద్వారా టీకా వృథాను అరికట్టవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి: నకిలీ కొవిషీల్డ్​ టీకాలతో కోట్ల రూపాయల దందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.