ETV Bharat / bharat

అల్లర్లలో కొడుకు మృతి- కూలీ బిగ్​ రివెంజ్​- 7సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఓడించి సూపర్​ విక్టరీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 9:30 PM IST

Chhattisgarh Election 2023 Labour Eswar Sahu
Chhattisgarh Election 2023 Labour Eswar Sahu

Chhattisgarh Election 2023 Labour Eswar Sahu : ఛత్తీస్​గఢ్​ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కుమారుడి హత్యతో కడుపుమండి ఎన్నికల బరిలో దిగిన ఓ దినసరి కూలీ.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థికి గట్టి షాకిచ్చారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇంతకీ ఆ కూలీ ఎవరు?

అల్లర్లలో కొడుకు మృతి- కూలీ బిగ్​ రివెంజ్​

Chhattisgarh Election 2023 Labour Eswar Sahu : 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో 54 చోట్ల విజయం సాధించిన బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం.. రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కుమారుడి హత్యతో కడుపుమండి ఎన్నికల బరిలో దిగిన ఓ దినసరి కూలీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విజయం ఛత్తీస్‌గఢ్‌లో పెను సంచలనం సృష్టించింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ సాహు ఓ దినసరి కూలీ. సాహు పనికి వెళ్తేనే వాళ్లింట్లో పూట గడిచేది. ఈశ్వర్‌సాహు కుమారుడు ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అల్లర్లలో కన్నుమూశాడు. ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్‌పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తన కుమారుడు మృతి చెందడాన్ని ఈశ్వర్‌ సాహు జీర్ణించుకోలేకపోయారు. కుమారుడి హత్యతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ కూడా ఆరోపించింది.

ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. కుమారుడి హత్యతో రగిలిపోతున్న ఈశ్వర్‌ సాహును భారతీయ జనతా పార్టీ సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. ఈ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ దిగ్గజం, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఈశ్వర్‌ సాహు 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంపై ప్రజలు ఇది కదా విజయమంటే అని కొనియాడుతున్నారు.

ఈటీవీ భారత్​లో మాట్లాడుతున్న ఈశ్వర్​ సాహు

మరోవైపు, ఈటీవీ భారత్​తో ఈశ్వర్​ సాహు ప్రత్యేకంగా మాట్లాడారు. అసత్యంపై సత్యం గెలిచిందని ఆయన తెలిపారు. తన విజయానికి సహకరించిన వారిందరికి ధన్యవాదాలు చెప్పారు. ప్రజలకు అడుగడుగునా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ అనేక తప్పులు చేసినట్లు ఆరోపించారు. తాను కాంగ్రెస్​ కోసం పెద్దగా మాట్లాడానని.. కానీ అసత్యంపై సత్యం సాధించిన విజయం తన గెలుపు అని చెప్పారు.

ఛత్తీస్​గఢ్​లో బీజేపీ మేజిక్​- కాంగ్రెస్​కు బిగ్ షాక్​! ఎగ్జిట్​ పోల్స్ అంచనాలు తారుమారు!!

ఛత్తీస్​గఢ్​లో బీజేపీ అద్భుతం- పక్కా స్కెచ్​తో బఘేల్​ పాలనకు తెర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.