ETV Bharat / bharat

'దేశ రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడలేం'

author img

By

Published : Feb 2, 2021, 4:29 PM IST

Rajnath Singh
'దేశ రక్షణ కోసం ఇతర దేశాలపై ఆధారపడలేం'

రానున్న కొద్ది సంవత్సరాల్లోనే రక్షణ తయారీ రంగంలో రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని భారత్​ చేరుకుంటుందని కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. కర్ణాటకలో జరిగిన ఏరోనాటిక్స్​ లిమిటెడ్​కు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

దేశ రక్షణ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​కు సంబంధించిన తేజస్​ మార్క్-2 తయారీ కేంద్రాన్ని రాజ్​నాథ్ కర్ణాటకలో ప్రారంభించారు. తేజస్​ అత్యంత శక్తిమంతమైన ఫైటర్​ జెట్​ అని, చాలా విషయాల్లో విదేశీ యుద్ధవిమానలకంటే మెరుగైనదని ఆయన అన్నారు.

"రక్షణ పరికరాల విషయంలో భారత్​ ఇతర దేశాలపై ఆధారపడకూడదు. తేజస్​పై చాలా దేశాలు ఆసక్తి కనబరిచాయి. కొన్ని సంవత్సరాల్లోనే రక్షణ తయారీ రంగంలో రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని భారత్​ చేరుకుంటుంది."

- రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి

భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు రూ.48,000 కోట్లతో 83 తేజస్​ ఫైటర్​ జెట్లను సమకూర్చుకోవాలని ఇటీవల మోదీ సర్కార్ నిర్ణయించింది. 2024 మార్చి నుంచి వీటి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఏటా 16 విమానాలను చొప్పున 83 ఫైటర్​ జెట్లను వైమానిక దళానికి హెచ్​ఏఎల్ అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్​ ఆర్​.మాధవన్​ ఇటీవల తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.