ETV Bharat / bharat

బొగ్గు లారీని ఢీకొట్టి బస్సు బోల్తా.. ఆరుగురు మృతి

author img

By

Published : Jan 22, 2022, 3:24 PM IST

Updated : Jan 22, 2022, 5:19 PM IST

bus-accident
ట్రక్కు ఢీకొని బస్సు బోల్తా

Bus accident in Odisha: బొగ్గు లోడ్​ లారీ ఢీకొట్టి బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ పసికందు సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఒడిశాలోని బాలాసోర్​ జిల్లాలో జరిగింది.

Bus accident in Odisha: ఒడిశాలోని బాలాసోర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గు లోడ్​తో వెళ్తున్న లారీ ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.

bus-accident
బోల్తా పడిన బస్సు వద్ద జనం

బాలాసోర్​ జిల్లాలోని సోరో పోలీస్​ స్టేషన్​ పరిధి.. బిదుఛక్​ వద్ద బస్సును బొగ్గు లోడ్​ లారీ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లిపోయాయి. బస్సు బోల్తా పడింది. బస్సు ఉదాలా నుంచి భువనేశ్వర్​ వైపునకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

bus-accident
బస్సు కింద చిక్కుపోయిన ప్రయాణికులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఓ పసికందు సహా ఐదుగురు మృతి చెందారని, 20 మంది ఇతర ప్రయాణికులు గాయపడినట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కూతురిపై రేప్​- కోర్టు ఆవరణలోనే నిందితుడిని కాల్చి చంపిన తండ్రి!

Last Updated :Jan 22, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.