ETV Bharat / bharat

ఇస్రో కొత్త మిషన్​- ఈ నెలాఖరున నింగిలోకి సీ-51

author img

By

Published : Feb 5, 2021, 4:02 PM IST

Brazilian, Indian startup satellite in ISRO's first mission in 2021 on Feb 28
ఇస్రో కొత్త మిషన్​- ఈనెలాఖరున నింగిలోకి సీ-51

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమవుతోంది. పీఎస్​ఎల్​వీ సీ-51ను ఈ నెలఖారున నింగిలోకి పంపనుంది. ఇందులో బ్రెజిల్​కు చెందిన శాటిలైట్​ సహా భారత్​కు చెందిన మూడు పేలోడ్స్​తో సీ-51 రాకెట్​ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.

2021లో తొలి అంతరిక్ష ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున పోలార్​ శాటిలైట్​ లాంచింగ్​ వెహికిల్​(పీఎస్​ఎల్​వీ) సీ-51 రాకెట్​ ద్వారా బ్రెజిల్​ ఉపగ్రహం అమెజానియా-1 సహా.. మూడు ఇండియన్​ పేలోడ్స్​ నింగిలోకి పంపనుంది ఇస్రో. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ఈ రాకెట్​ నింగిలోకి దూసుకెళ్తుందని ఇస్రో ఛైర్మన్​ కే శివన్​ తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శివన్.. సమీప భవిష్యత్​లో చేపట్టనున్న మిషన్​ ఎంతో గొప్పదన్నారు. దేశానికే ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు.

ఈ మిషన్​లో ప్రయోగించనున్న ప్రధాన పేలోడ్​ అమెజానియా-1 అని తెలిపిన ఇస్రో.. భూమిని పరిశీలించడానికి బ్రెజిల్ అభివృద్ధి చేసిన తొలి శాటిలైట్​ అని పేర్కొంది. భారత్​కు చెందిన మరో మూడు ఉపగ్రహాలు.. 'ఆనంద్'​, 'సతీశ్​ ధావన్'​, 'యూనిటీశాట్​' పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవని తెలిపింది. 'ఆనంద్​'ను భారత్​కు చెందిన అంతరిక్ష స్టార్టప్​ పిక్సెల్​ రూపొందించగా.. 'సతీశ్​ ధవన్​ శాటిలైట్​'ను చెన్నైకి చెందిన స్పేస్​ కిడ్జ్​ ఇండియా నిర్మించింది. 'యూనిటీశాట్​'ను జెప్పియార్​ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ ఇంజినీరింగ్, శ్రీపెరుంబుదూర్​(జిట్​శాట్​), జీహెచ్ రైసోని కాలేజ్​ ఆఫ్​ ఇంజినీరింగ్​, నాగ్​పుర్​(జీహెచ్​ఆర్​సీఈశాట్​), శ్రీ శక్తి ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ అండ్​ టెక్నాలజీ, కోయంబత్తూర్​(శ్రీ శక్తి శాట్​) సంయుక్తంగా రూపొందించాయి. ​

ఇదీ చూడండి: సభాముఖంగా సాగు చట్టాలపై మోదీ ప్రసంగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.