ETV Bharat / bharat

నకిలీ ముఠా గుట్టురట్టు, ఏకంగా పోలీస్​ స్టేషన్​నే ఏర్పాటు చేసి

author img

By

Published : Aug 18, 2022, 12:34 PM IST

Bihar fake police station నకిలీ పోలీసులుగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన బిహార్​లోని బాంకా జిల్లాలో జరిగింది. నిందితుల వద్ద నుంచి ఆయుధాలు, యూనిఫామ్స్, ఎఫ్​ఐఆర్​ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

bihar fake police station
నకిలీ పోలీసులు

Bihar fake police station: బిహార్​ బాంకా జిల్లాలో నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ గెస్ట్​ హౌస్​ను పోలీస్ స్టేషన్​గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్న నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆయుధాలు, యూనిఫామ్స్, ఎఫ్​ఐఆర్​ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనురాగ్​ అనే వ్యక్తికి చెందిన గెస్ట్ హౌస్​ను పోలీస్​ స్టేషన్​గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరిని అరెస్ట్​ చేసి విచారించగా.. తామంతా రోజువారీ కూలీకి పనిచేస్తున్నామని చెప్పారు. అనితా దేవి అనే మహిళ ఈ పోలీసు బృందాన్ని నడుపుతోంది. ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్​ తనను ఇన్​స్పెక్టర్​గా నియమించారని అనితా చెప్పింది.

bihar fake police station
నకిలీ పోలీసులు

నిందితులను లోధియా గ్రామానికి చెందిన రమేశ్​కుమార్, ​సుల్తాన్​గంజ్​ జిల్లా ఖాన్పుర్​కు చెందిన జులీ కుమార్​, భగల్​పుర్​కు చెందిన ఆకాశ్​ కుమార్​గా గుర్తించారు. తామంతా సీనియర్​ పోలీస్​ అధికారి భోలా యాదవ్​ సారథ్యంలో పని చేస్తున్నామని నిందితులు తెలిపారు. వీరంతా పోలీసుల పేరు చెప్పి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్​ స్టేషన్​కు రాగా.. వారి వద్ద నుంచి భారీగా డబ్బులను సేకరించారు. అనంతరం వారి మధ్య రాజీ కుదిర్చి పంపించేవారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని పట్టుకుంటామని డీసీపీ శ్రీవాస్తవ తెలిపారు. పోలీసుల కనుసన్నలోనే జరుగుతున్నా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి: ప్రేమ పేరుతో వేధింపులు, నడిరోడ్డులో యువతిపై కాల్పులు

తల్లిని బతికించుకునేందుకు తోపుడు బండిపై ఆస్పత్రికి, చివరికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.