ETV Bharat / bharat

'చైనాతో చర్చలపై ఇప్పుడే ఏం చెప్పలేం'

author img

By

Published : Oct 15, 2020, 8:07 PM IST

Talks between India and China are going on; do not want to pre-judge: Jaishankar
'చైనాతో చర్చలపై ఇప్పుడే ఏం చెప్పలేం'

భారత్​-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. వీటిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు విదేశాంగమంత్రి జైశంకర్​. అయితే ఈ పరిస్థితులు ఇరు దేశాలకు రహస్యమైనవని పేర్కొన్నారు.

సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్​-చైనా దేశాలు చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ పునరుద్ఘాటించారు. అయితే ఈ చర్చల్లో ఏం జరుగుతోందనేది మాత్రం రహస్యంతో కూడిన వ్యవహారమని పేర్కొన్నారు.

భారత్​-చైనా మధ్య జరుగుతున్న చర్చలపై స్పష్టమైన జవాబు ఇవ్వాలని ఓ మీడియా సమవేశంలో అడగగా.. 'చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంద'ని వెల్లడించారు జైశంకర్​.

అదే సమయంలో.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల మోహరింపు జరిగిందని అంగీకరించారు విదేశాంగమంత్రి.

"చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు.. ఇరు దేశాలకు అత్యంత రహస్యమైనవి. ఇప్పుడే నేను ఏ విషయాన్ని బహిరంగంగా చెప్పలేను. పరిస్థితులపై ముందుగానే ఓ అవగాహనకు రాలేను."

-- జైశంకర్​, విదేశాంగమంత్రి.

టిబెట్​లో పరిస్థితులపై ప్రశ్నించగా.. లద్దాఖ్​తో సంబంధం లేని విషయాలపై మాట్లాడకూడదని అభిప్రాయపడ్డారు విదేశాంగమంత్రి.

ఇదీ చూడండి:- 'పాక్​తో చర్చలా? అంతా అబద్ధం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.