ETV Bharat / bharat

భారత్​- బంగ్లా సరిహద్దు 'స్మార్ట్​ ఫెన్స్'​ వచ్చే ఏడాది పూర్తి

author img

By

Published : Dec 29, 2019, 8:11 PM IST

'Smart fence' along riverine Bangla border in Assam by July 2020: BSF DG
భారత్​- బంగ్లా సరిహద్దు 'స్మార్ట్​ ఫెన్స్'​ పూర్తయ్యేది అప్పుడే

అసోంలోని భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దు మీదుగా అధునాతన​ కంచెను ఏర్పాటు చేసే ప్రాజెక్టు.. వచ్చే ఏడాది జులై నాటికి పూర్తవుతుందని బీఎస్ఎఫ్​ డీజీ వీకే జోహ్రి తెలిపారు.

అసోంలోని భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దు ద్వారా వలసలను అరికట్టేందుకు నిర్ణయించిన స్మార్​ ఫెన్స్​ ప్రాజెక్ట్​ వచ్చే ఏడాది పూర్తి కానుంది. ఈ మేరకు వచ్చే ఏడాది జులై నాటికి కంచె నిర్మాణం పూర్తవుతుందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​) డైరక్టర్​ జనరల్​ వీకే జోహ్రీ తెలిపారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు ఆలస్యమవుతోందన్నారు. బంగ్లాదేశ్​ సరిహద్దు భద్రతాధికారి మేజర్​ జనరల్​ షఫీనుల్​ ఇస్లాంతో కలిసి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు జోహ్రీ.

అసోంలోని బ్రహ్మపుత్ర నది మీదుగా ధుబ్రీలో సుమారు 55 కిలోమీటర్ల మేర అలారం శబ్ధంతో కూడిన సాంకేతికమైన కంచెను ఏర్పాటు చేసేందుకు బీఎస్​ఎఫ్​ కృషి చేస్తోంది. ఈ నది మీదుగా అక్రమ వలసలు, పశువుల రవాణా ఎక్కువగా సాగే అవకాశం ఉంది. జమ్ముకశ్మీర్​లోనూ పాకిస్థాన్ సరిహద్దు వెంబడి సీఐబీఎంఎస్ (సమీకృత సమగ్ర సరిహద్దు నిర్వహణ వ్యవస్థ) ​లో భాగంగా ఈ తరహా కంచెను ఏర్పాటు చేసింది బీఎస్​ఎఫ్​.

ఇదీ చూడండి: బూడిద రంగులో కేరళ అడవులు.. కారణం సీతాకోకచిలుకలు!

Bengaluru, Dec 29 (ANI): Mortal remains of Pejavara Mutt chief, Vishwesha Teertha Swami were brought to Basavanagudi in Bengaluru. He passed away at Udupi Sri Krishna Mutt earlier today (December 29). Chief Minister BS Yediyurappa attended the last ceremony. Pejawar Mutt pontiff Vishwesha Teertha Swami passed away while undergoing treatment for extensive pneumonia. State Government has announced three-day state mourning.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.